Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలో నీటి నుంచి ఐదు రోజులపాటు ఉష్ణో గ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
అటు ఏపీలో రాబోయే రెండు మూడు రోజులు వడగాలులు తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధి కారులు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రజలు అప్ర మత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలియజే స్తున్నారు. నిన్న నిర్మల్ జిల్లా దస్తురాబాద్ లో అత్యధికంగా 43.1, ఏపీలోని నంద్యాలలో 42 డిగ్రీల టెంపరేచర్ నమోదయిందని అధికారులు తెలిపారు.
చిన్నపిల్లలు, వృద్దులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. గడిచిన వారం రోజుల నుంచి ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో వడగాలులు వీస్తున్నాయని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో బయటికి వచ్చేవారు తప్పకుండా క్యాపులు ధరించి బయటికి రావాలని సూచిస్తున్నారు.