YS Sharmila : సిద్ధం సభలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 600 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. విశాఖలో న్యాయ సాధన సభలో ప్రసంగించిన ఆమె ప్రత్యేక హోదాను, పోలవరాన్ని, వైజాగ్ స్టీల్ ను కేంద్రం వద్ద తాకట్టు పెట్టడానికి సిద్ధమా అని వైయస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పూర్తి మద్యపాన నిషేధమని చెప్పి మహిళలను 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని నిరు ద్యోగులను మోసం చేయడానికి సిద్ధమా అని షర్మిల ప్రశ్నించారు. దేనికి సిద్ధం జగనన్న?.. ప్రజ లు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని షర్మిల అన్నారు.
ఐదు సంవత్సరాల పాటు ప్రజలు ఇబ్బందులు పడ్డారని షర్మిల అన్నారు. పథకాల పేరుతో అకౌం ట్లో డబ్బులు వేస్తే మళ్లీ అధికారం లోకి రావ చ్చు అనుకుంటు న్నారని ప్రజలు అన్నీ గమనిస్తు న్నార ని షర్మిల వ్యాఖ్యానించారు.