27.8 C
India
Wednesday, February 18, 2026
More

    Tirupati: తిరుమలలో భక్తుల ప్రాణాలకు రక్షణేది..?

    Date:

    Tirupati
    Tirupati

    Tirupati:

    తిరుమలలో భక్తుల ప్రాణాలకు రక్షణ కొరవడినట్లు కనిపిస్తున్నది. తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. దేవదేవుడి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు కొండపైకి చేరుకుంటారు. కొందరు వాహనాల్లో, మరికొందరు కాలినడకన మెట్ల మార్గంలో వస్తుంటారు. అయితే కొంత కాలంగా ఈ మెట్ల మార్గంలో వచ్చే భక్తుల భద్రతను ఏపీ ప్రభుత్వం, టీటీడీ గాలికొదిలేసినట్లు విమర్శలు వస్తున్నాయి. కనీసం రక్షణ చర్యలు కానరావడం లేదని భక్తులు మండిపడుతున్నారు. మౌళిక వసతుల కల్పనలోనూ ప్రస్తుత జగన్ సర్కారు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నది. తెలుగు రాష్ర్టాల భక్తుల తిరుమలలో పరిస్థితిని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.

    అయితే తాజాగా ఆరేళ్ల చిన్నారి చిరుత పులిదాడిలో మరణించడం సంచలనంగా మారింది. అలిపిరి కాలినడక మార్గంలో శుక్రవారం రాత్రి 8 గంటలకు ఈ ఘటన జరిగింది.  చిన్నారి లక్షిత సహా కుటుంబ సభ్యులు రాత్రి 11 గంటలకు లక్ష్మీనరసింహ స్వామి గుడి వద్దకు చేరుకున్నారు. ఇంకో గంటలో తిరుమలకు చేరుకోవాల్సి ఉంది. ఒక్క సారి గా చిరుత లక్షిత పై దాడి చేసి, అడవిలో కి లాక్కెళ్లింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే రాత్రి కావడంతో గాలింపు చర్యలు ఫలించలేదు. ఉదయం అడవిలోనే సగం తినేసిన లక్షిత మృతదేహం దొరికింది.  అయితే గతంలోనూ బాలుడిపై చిరుత దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది.

    తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా, చిరుత పులుల సంచారం పెరిగిందని తెలిసినా అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడంలో టీటీడీ విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీటీడీ పాలకమండలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కాలినడక మార్గంలో  పూర్తి స్థాయి రక్షణ చర్యలు చేపట్టాలని భక్త జనం కోరుతున్నది. చిన్నారి లక్షిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తుున్నది. అలిపిరి నుంచి కాలినడక మార్గంలో చిరుత పులుల సంచారం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భద్రతా చర్యలు విస్తృతం చేయాలనే అభిప్రాయం వినిపిస్తున్నది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    GST : ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్టీ సునామీ!

    GST : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏప్రిల్ 2025లో జీఎస్టీ వసూళ్లలో చారిత్రక...

    Andhra Pradesh : దేశంలో రెండవ అత్యధిక ఆర్థిక వృద్ధిని సాధించిన ఆంద్రప్రదేశ్

    Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 2024-25 ఆర్థిక సంవత్సరంలో బలమైన...

    Pemmasani : ఎయిమ్స్ అభివృద్ధికి పెమ్మసాని ప్రతిపాదనలు – ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం సహకారం: నిర్మలా సీతారామన్ హామీ

    ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కేంద్ర ఆర్థిక...

    రా.7గంటలకు సంచలన నిజం బయటకు.. వైసీపీ ట్వీట్

    వల్లభనేని వంశీపై నమోదైన కేసు గురించి సంచలన విషయం వెల్లడించబోతున్నట్లు వైసీపీ...