Tamil Nadu : భార్యకు నార్మల్ డెలివరీ చేయాలని ఓ భర్త చేసిన ప్రయత్నం వికటించింది. యూట్యూబ్ లో చూస్తూ తన భార్యకు సాధారణ కాన్పు చేసేందుకు ప్రయత్నించగా, ఆమె ప్రాణాలు కోల్పోయింది. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన లోకనాయకి అనే యువతికి మాదేశ్ కి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే మాదేశ్ దంపతులు సహజ సిద్ధమైన ఆహారం తీసుకుంటుంటారు. ఇందుకోసం ఇంటి ఆవరణలోనే ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు. పూర్తిస్థాయిలో కృత్రిమ పద్ధతులకు ఈ కుటుంబం దూరంగా ఉంటున్నది.
అయితే లోకనాయకి గర్భవతి కావడంతో, ఆమె సహజ పద్ధతిలో ప్రసవించాలని మాదేశ్ తెలిసీ తెలియని పనిచేశాడు. యూట్యూబ్ లో నార్మల్ డెలివరీ వీడియో చూస్తూ భర్తకు పురుడు పోయాలనుకుంది. ప్రయోగం వికటించడంతో అధిక రక్తస్రావమై చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచింది. అతడికి అవగాహన లేకపోవడమో లేదా అతిక తెలివో కానీ, కట్టుకున్న భార్యకు తానే ట్రీట్ మెంట్ చేయాలని ఇంటిని దవాఖానగా మార్చాడు. నిండు గర్భంతో ఉన్న భార్యకు నార్మల్ డెలివరీ చేయాలని, యూ ట్యూబ్ వీడియో చూస్తూ ఆమె ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. మాదేశ్ చేసిన ప్రయోగం బెడిసి కొట్టింది.
అయితే లోక్ నాయకి ఒక బిడ్డను ప్రసవించిన తర్వత మరణించింది. తీవ్ర రక్తస్రావం కావడంతో మాదేశ్ వెంటనే దవాఖానకు తీసుకెళ్లాడు. అయితే అప్పటికే లోకనాయకి చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మంగళవారం ఈ ఘటన జరిగింది. అయితే మాదేశ్ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినప్పటికీ అసలు నిజం బయటపడింది. తల్లిదండ్రులు తన అల్లుడి మూర్ఖత్వమో, అమాయకత్వమో తెలియక తలలు బాదుకుంటున్నారు. తమ బిడ్డను కోల్పోయి లబోదిబోమంటున్నారు.