కరోనా మళ్ళీ పంజా విసురుతోంది. గత నెల రోజులుగా కరోనా రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. మహారాష్ట్ర , గుజరాత్ , తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ , ఢిల్లీ తదితర రాష్ట్రాలతో పాటుగా దేశ వ్యాప్తంగా కూడా కరోనా రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దాదాపు 15 వేలకు చేరుకుంది కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.
ఇక తెలంగాణలో కూడా కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా నమోదు అవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదు అవుతోంది. దాంతో అన్ని రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. టెస్ట్ ల సంఖ్య గణనీయంగా పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా జలుబు , దగ్గు , జ్వరం , ఒళ్ళు నొప్పులు , తలనొప్పి తదితర కారణాలతో సతమతం అవుతున్న వాళ్ళ సంఖ్య గణనీయంగా పెడుతుండటంతో డాక్టర్లను సంప్రదించాలని , సొంత వైద్యం చేసుకోవద్దని , అలాగే విచ్చవిడిగా యాంటీ బయోటిక్స్ వాడొద్దని హెచ్చరిస్తోంది కేంద్రం.