ఈ రోజుల్లో రక్తహీనత సమస్య వేధిస్తోంది. మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. ఎందుకంటే వారికి నెలసరి సమయంలో రక్తం బాగా పోతుంది. దీంతో రక్తహీనతకు గురవుతారు. రక్తహీనత సమస్య ఉంటే వారిలో ఇబ్బందులు రావడం సహజం. అలసట, ఆయాసం వంటివి బాధిస్తాయి. ఏ పనిచేయాలన్నా కుదరదు. దీనికి మనం మంచి ఆహారాలు తీసుకుంటేనే మంచి ఫలితాలు వస్తాయి.
రక్తహీనత ఉంటే ప్రొటీన్లు ఉన్న ఆహారాలు తీసుకుంటే మంచిది. రక్తహీనత సమస్య దూరం చేసుకోవాలంటే ఎండు ద్రాక్ష బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు చర్మం మెరిసేలా చేస్తాయి. నల్ల ఎండు ద్రాక్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాల్షియం కూడా బాగుంటుంది. ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
నల్ల ఎండు ద్రాక్షలో ఐరన్ తోపాటు విటమిన్ సి ఉంటుంది. వెంట్రుకల ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎండు ద్రాక్షలోని పొటాషియం రక్తంలో సోడియం మోతాదు తగ్గేలా చేస్తుంది. ఎండుద్రాక్షలను తరచుగా తింటుంటే రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. రోజు ఎండు ద్రాక్ష తింటే గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.
వీటిని తినడం వల్ల మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. నెలసరి సమస్యలకు కూడా చెక్ పెడుతాయి. నల్ల ఎండు ద్రాక్షతో జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. ఇలా రక్తహీనత సమస్య ఉన్న వారు వీటిని తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. అనారోగ్య సమస్యలు దరి చేరకుండా పోతాయి. డ్రై ఫ్రూట్స్ లో ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు మనకు దక్కడం ఖాయం.