మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకరు.. మరి వరుణ్ తేజ్ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేసి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ప్రేమించిన లావణ్య త్రిపాఠీతో వరుణ్ తేజ్ నిశ్చితార్ధం నిన్న చాలా గ్రాండ్ గా జరిగింది. ఈమె మెగా కోడలు అవుతుంది అని ఎవ్వరూ ఊహించలేదు.. ఈ ఊహించని పరిణామం తో ఒక్కసారిగా వీరి లవ్ స్టోరీ ఏంటి? ఎలా పరిచయం అయ్యారు? అనే దానిపై అందరిలో క్యూరియాసిటీ పెరిగింది.
వరుణ్ తేజ్ ఎంతో సీక్రెట్ గా లావణ్యతో ప్రేమాయణం సాగించి పెద్దలను ఒప్పించి పెళ్లి పీటలు ఎక్కనున్నారు.. నిన్న జూన్ 9న వీరి ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా బంధు మిత్రుల మధ్య జరిగింది. ఎంగేజ్మెంట్ కు సంబంధించిన పిక్స్ కూడా బయటకు వచ్చి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ గత ఐదేళ్లుగా ప్రేమించు కుంటున్నారు అని తెలిసి అంతా షాక్ అవుతున్నారు.
అసలు వరుణ్ లావణ్య ప్రేమ ఎక్కడ మొదలయ్యింది అంటే.. అందుతున్న సమాచారం ప్రకారం వీరు 2016లో మిస్టర్ సినిమాలో కలిసి నటించారు.. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో లావణ్య, హెబ్బా హీరోయిన్ లుగా నటించారు.. ఈ సినిమా షూట్ సమయం లోనే వరుణ్ లావణ్య పట్ల ఆకర్షితుడు అయ్యి చనువుగా ఉండడంతో ఈమె కూడా అతడిపై అభిమానం పెంచుకుందట.
మిస్టర్ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా వీరు అప్పటి నుండి సన్నిహితంగా ఉండడం స్టార్ట్ చేశారట.. ఒక రోజు నేరుగా లావణ్యను వరుణ్ పెళ్లి చేసుకుందామా అని అడిగారని అప్పటికే ఈమె కూడా అతడిపై ఇష్టం ఉండడంతో ఎస్ అన్నదట. అపప్టి నుండి కూడా వీరి ప్రేమ గురించి బయటకు రాకుండా జాగ్రత్త తీసుకున్నారు. కానీ 2020లో నిహారిక పెళ్లి సమయంలో వీరి ప్రేమ విషయం కొద్దిగా లీక్ అయ్యింది.
ఈ అమ్మడి పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవ్వగా లావణ్య, రీతూ వర్మ హాజరవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. అప్పటి నుండి నిఘా పెట్టడంతో వీరి రిలేషన్ బయటకు వచ్చింది. అయిన స్నేహితులమే అని చెప్పుకొచ్చిన ఈ జంట ఎంగేజ్మెంట్ తో క్లారిటీ ఇచ్చేసారు.. ఐదేళ్లకు పైగానే రహస్యంగా ఉన్న వీరి బంధం బయట పడి పెళ్లి చేసుకోబోతున్నారు.