30.8 C
India
Sunday, June 15, 2025
More

    చిరంజీవి – బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే వార్త ఇదే

    Date:

    Mytri movie makers mastar plan with balakrishna and chiranjeevi
    Mytri movie makers mastar plan with balakrishna and chiranjeevi

    అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అదిరిపోయే మాస్టర్ ప్లాన్ వేసింది. తాజాగా ఈ సంస్థ శిఖరాగ్ర కథానాయకులు చిరంజీవి , బాలకృష్ణ లతో ఏకకాలంలో సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవితో వాల్తేరు వీరయ్య , బాలయ్య తో వీర సింహా రెడ్డి చిత్రాలను నిర్మిస్తోంది. అయితే ఈ రెండు చిత్రాలను కూడా 2023 జనవరిలో సంక్రాంతి కానుకగా జనవరి 12 న బాలయ్య వీర సింహా రెడ్డి చిత్రాన్ని అలాగే జనవరి 13 న చిరు వాల్తేరు వీరయ్య ను విడుదల చేస్తున్నారు. ఒక్క రోజు తేడాతో ఇద్దరు శిఖరాగ్ర కథానాయకుల చిత్రాలను విడుదల చేస్తోంది.

    సాధారణంగా సినిమా విడుదల ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ లను నిర్వహించడం , దానికి ఒకరిద్దరిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం చేస్తుంటారు. ఇద్దరు స్టార్ హీరోలు అందునా ఒకరోజు తేడాలో రెండు పెద్ద సినిమాలు విడుదల అవుతుండటంతో మైత్రి మూవీ మేకర్స్ భారీ ఆలోచన చేసింది. బాలయ్య వీర సింహా రెడ్డి వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి ని అలాగే చిరు వాల్తేరు వీరయ్య వేడుకకు బాలయ్య ను ముఖ్య అతిథిగా పిలిస్తే తప్పకుండా సంచలనం అవుతుందని, అలాగే కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిన వాళ్ళం అవుతామని భావిస్తున్నారట. ఇక చిరు , బాలయ్య ఇద్దరు కూడా ఊర మాస్ హీరోలు కావడం , ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరోలు కావడంతో ఈ ప్రయోగం చేస్తే బాగుంటుందని డిసైడ్ అయ్యారట. ఇదే విషయాన్ని అటు బాలయ్య కు ఇటు చిరంజీవి కి కూడా చెప్పారట.

    ఈ కుండ మార్పిడి లాంటి పద్ధతి బాలయ్య కు చిరంజీవి కి కూడా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే నందమూరి – మెగా అభిమానులకు మాత్రమే కాదు యావత్ తెలుగు ప్రేక్షకులకు కూడా శుభ సూచకం అనే చెప్పాలి. అభిమానులు పోటీకి పోయి మనస్పర్థలు పెంచుకుంటారు కానీ హీరోలు మాత్రం ఎప్పుడూ ఒక్కటే అని నిరూపించినట్లు అవుతుంది. అలాగే స్టార్ హీరోల అభిమానుల మధ్య సఖ్యత నెలకొంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకే వేదికపై బాలయ్య , చిరంజీవి కలిసి ఫోటోలకు ఫోజిస్తే …… మనమంతా ఒక్కటే అనే సంకేతం ఇస్తే…… అభిమానులు పులకించిపోవడం ఖాయం. బాక్సాఫీస్ వద్ద కొదమ సింహల్లా గర్జిస్తాం కానీ బయట మిత్రులమే అనే సంకేతం ఇచ్చినట్లు అవుతుంది. మొత్తానికి ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Chiranjeevi : గద్దర్ సినిమా అవార్డ్స్ పై చిరంజీవి సంచలన ప్రకటన

    Chiranjeevi : తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌-2024పై అగ్ర కథానాయకుడు...

    Balakrishna : బాలకృష్ణ నా పై సీరియస్ అయ్యాడు

    Balakrishna : హీరోయిన్ లయ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ,...

    Balayya : బాలయ్య బాబు, ఎన్టీఆర్ మధ్య మాటలు కలిపింది ఎవరో తెలుసా..?

    Balayya : తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్థాయిలో వరుసగా సక్సెస్‌ఫుల్...