సీనియర్ నటుడు నరేష్ మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. గతంలో పలు యూట్యూబ్ ఛానల్స్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు నరేష్. అలాగే పవిత్ర లోకేష్ కూడా ఫిర్యాదు చేసింది. అయితే ఆ కేసు ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవడం కోసం సైబర్ క్రైమ్ కార్యాలయనికి వచ్చాడు నరేష్.
అయితే నరేష్ – పవిత్ర లోకేష్ ల వ్యవహారశైలి పట్ల నెటిజన్లు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ముసలోళ్ళకు దసరా పండగ అవసరమా ? వయసుకు తగ్గట్లుగా వ్యవహరిస్తే అందరికి మంచిదని దుయ్యబడుతున్నారు. మీరు లోపల ఎన్ని వేషాలు వేసినా ఫరవాలేదు కానీ మీ వేశాలన్ని అత్యంత జుగుప్సాకరంగా సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసి రచ్చ రచ్చ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలదన్నట్లుగా ఆమధ్య పెళ్లి చేసుకోబోతున్నామంటూ లిప్ లాక్ చేస్తూ నరేష్ – పవిత్ర ఓ వీడియో విడుదల చేసారు. దాని మీద మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.
అయితే నెటిజన్లు ఎంతగా విమర్శలు చేస్తున్నా …… నరేష్ , పవిత్ర లకు తెలిసిన వాళ్ళు అభ్యంతరం చెబుతున్నా వీళ్ళు మాత్రం పట్టించుకోవడం లేదు. మాదారి మాదే అంటూ రెచ్చిపోతున్నారు నరేష్ – పవిత్ర.