Jagan-Modi : బిజెపి, వైసిపి పాలనలో ఇంటి పన్ను భారం ప్రజలపై పడిందని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ఆరోపించారు. శాశ్వత భారం వేసే ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను విధాన పాపం మోడీ, జగన్ లదనీ ఆయన విమర్శించారు.
విజయవాడ పట్టణ ప్రజల జీవితం నరకప్రాయంగా మారిందన్నారు. అభివృద్ధికి కేంద్రాలుగా ఉండాల్సిన పట్టణాలు సమస్యల కేంద్రాలుగా మారాయి ఆయన మండిపడ్డారు.
గత ఐదేళ్లలో మోడీ ప్రభుత్వం ఆదేశాలకు లొంగిపోయి వైసిపి ప్రభుత్వం ఆస్తి విలువ ఆధారిత పన్ను విధానాన్ని చట్టాన్ని తెచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివలన ప్రతి సంవత్సరం 15% పైగా ఇంటి పన్ను పెరిగిందని శాశ్వత ప్రమాదంగా మారిందని ఆయన అన్నారు.