అగ్ర నిర్మాత దిల్ రాజు వివాదాస్పద వ్యాఖ్యలు తమిళనాట తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దాంతో తమిళనాట స్టార్ హీరో అయిన అజిత్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ దిల్ రాజు ఏమన్నాడు …… అది ఎలా మారింది అంటే …… తాజాగా ఇళయ దళపతి విజయ్ హీరోగా ” వారిసు ” అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు అగ్ర నిర్మాత దిల్ రాజు.
ఈ సినిమా ఒక్క తమిళంలోనే కాకుండా హిందీలో తెలుగులో , కన్నడ , మలయాళంలో కూడా విడుదల అవుతోంది. విజయ్ పెద్ద హీరో దాంతో తమిళనాట నాకు ఎక్కువ థియేటర్లు కావాలి అని అడుగుతున్నాడు దిల్ రాజు. ఇక ఇదే సమయంలో తమిళనాట మరో స్టార్ హీరో అజిత్ సినిమా ” తునివు ” కూడా సంక్రాంతికే విడుదల అవుతోంది. ఈ సినిమా కూడా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. దాంతో తమిళనాట ఇది వివాదంగా మారింది.
అజిత్ కంటే విజయ్ పెద్ద హీరో కాబట్టి అజిత్ కు ఇచ్చే థియేటర్ ల కంటే ఎక్కువగా నాకు ఇవ్వాలని దిల్ రాజు అడిగినట్లు ప్రచారం లోకి వచ్చింది. ఈ మాటలు దిల్ రాజు మరోలా అన్నాడట. కానీ అజిత్ కంటే విజయ్ పెద్ద హీరో …… విజయ్ మాత్రమే నెంబర్ వన్ హీరో అన్నట్లుగా చిత్రీకరించారు. ఇంకేముంది తమిళనాట అజిత్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. తమిళనాట విజయ్ ఫ్యాన్స్ కు అలాగే అజిత్ ఫ్యాన్స్ కు అస్సలు పడదు. అలాంటిది ఇలాంటి వ్యాఖ్యలు చేసాడని ప్రచారం కావడంతో దిల్ రాజు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అజిత్ ఫ్యాన్స్.
ఈ వివాదం అనవసరంగా పెద్దది అవుతుండటంతో ఈరోజు సాయంత్రం ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నాడట. అందుకే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసాడు దిల్ రాజు. ఈ మీడియా సమావేశం తర్వాత అయినా అజిత్ – విజయ్ ఫ్యాన్స్ మధ్య అగాధం దూరం అవుతుందేమో చూడాలి. వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందని భావిస్తున్నారు.