34 C
India
Friday, April 26, 2024
More

    CM own district : అమరావతిని కాదన్న సీఎం జగన్.. సొంత జిల్లాకే ఆ చాన్స్!

    Date:

    CM own district
    CM own district, ap cm Jagan

    CM own district : ఏపీ సీఎం జగన్ ముందు నుంచి అమరావతికి వ్యతిరేకంగానే ఉన్నారు. టీడీపీ హయాంలో తీసుకున్న ఈ రాజధాని నిర్ణయాన్ని పక్కన పెట్టేసి, మూడు రాజధానులు అంటూ ఆయన ముందుకెళ్లారు. న్యాయస్థానాల్లో ఇబ్బందులు ఎదురైనా, నాడు రాజధానికి భూములిచ్చిన రైతులు వ్యతిరేకించినా ఇప్పటివరకు రాజధానిపై తేల్చకుండా ముందుకు సాగుతున్నారు. అమరావతి శాసన రాజధాని, విశాఖకు పరిపాలన రాజధాని అంటూ ఆయన ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం విస్మయానికి గురిచేస్తున్నది. కొత్త నగర నిర్మాణంపై ఆయన తీసుకున్న నిర్ణయం విమర్శలకు కారణమవుతున్నది.

    15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు దేశంలో కొత్తగా ఎనిమిది నగరాలను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికోసం ప్రతిపాదనలు పంపాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం అమరావతిలో అన్ని వనరులు, అవకాశాలు ఉన్నా, మరో కొత్త పేర్లు ప్రకటిస్తూ ప్రతిపాదనలు పంపింది. సీఎం సొంత జిల్లా అయిన కడపలోని కొప్పర్తి పేరును తెరపైకి తెచ్చింది. శాసన రాజధానిగా అమరావతికి తొలి ప్రాధాన్యమివ్వాల్సిన సర్కారు కొప్పర్తి పేరు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

    కేంద్రం నిర్మించాలనుకున్న ఈ కొత్త నగరానికి రూ. 1000 కోట్ల మేర కేంద్రం నిధులు కేటాయిస్తుంద. ఏటా 250 కోట్లు ఇస్తుంది. అయితే అమరావతి అభివృద్ధి చేయాలనుకుంటే కేంద్రం ఇచ్చే నిధులను వాడుకోవచ్చు నాలుగేళ్లుగా అమరావతిని పక్కన పెట్టిన రాష్ట్రం ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ప్రస్తుతం ఆర్థిక సంఘం ప్రతిపాదనలతో వారు అమరావతిని అత్యద్భుతంగా తీర్చిదిద్దవచ్చు. అమరావతిని అభివృద్ధి చేస్తే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలకు దీటుగా తయారవుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకు వనరులు పుష్కలంగా ఉన్నాయని ప్రణాళికే ముఖ్యమని చెబుతూ వచ్చారు.

    కానీ రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా అమరావతిపై కక్షపూరితంగా ముందుకెళుతున్నదని అంతా అనుకుంటున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి అయినా ఈ నగరం నిర్మాణానికి అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

    అమరావతిలో కొత్త నగర నిర్మాణానికి సేకరణ సమస్య లేదు ఇప్పటికే అమరావతిలో భూసేకరణ పూర్తయింది మిగులు భూమి కూడా ఉంది. జల వనరులు, రవాణా సదుపాయాలు, నిధులు, రుణ అవకాశాలు పుష్కలంగా ఉన్నా, రాష్ట్రంలోని వైఎస్ జగన్ ప్రభుత్వం అమరావతిని నిర్లక్ష్యం చేయడం విమర్శలకు తావిస్తున్నది. ఏదేమైనా ఒక రాష్ర్ట భవిష్యత్  ను అంధకారం చేసేలా ఉన్న రెండు పార్టీల మధ్య వార్ ప్రజల మనోభావాలను పట్టించుకోవడం లేదు.

    Share post:

    More like this
    Related

    Canada : కెనడాలో ఉద్యోగాల్లేవ్ రాకండి..సీనియర్ సిటిజన్ వేడుకోలు.. వీడియో వైరల్

    Canada : భారత్ లో గ్రాడ్యుయేట్ అయిన ప్రతీ ఒక్కరి కల...

    IPL 2024 Today : కోల్ కతా నైట్ రైడర్స్.. పంజాబ్ మధ్య కీలక పోరు

    IPL 2024 Today : ఐపీఎల్ లో ఈ సీజన్ లో...

    SRH VS RCB : సన్ రైజర్స్ పై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

    SRH VS RCB : సన్ రైజర్స్ విజయాలకు ఆర్సీబీ బ్రేక్...

    YS Jagan : వైఎస్ జగన్.. మరో జైత్రయాత్ర

    YS Jagan : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే సిద్ధం పేరిట...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YCP : వైసీపీ లోకి జనసేన నుండి భారీ చేరికలు

    YCP Vs Janasena YCP VS Janasena : సీఎం జగన్ పాలన చూసి...

    KCR : జగన్ మళ్లీ గెలుస్తారు: కేసీఆర్

    KCR : ఏపీలో జరిగే ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలుస్తారనే సమాచారం...

    Election Commission : ఎన్నికల కమిషన్ ఎవరికీ చుట్టం ????

    Election Commission : ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల...