27.8 C
India
Sunday, May 28, 2023
More

    CM own district : అమరావతిని కాదన్న సీఎం జగన్.. సొంత జిల్లాకే ఆ చాన్స్!

    Date:

    CM own district
    CM own district, ap cm Jagan

    CM own district : ఏపీ సీఎం జగన్ ముందు నుంచి అమరావతికి వ్యతిరేకంగానే ఉన్నారు. టీడీపీ హయాంలో తీసుకున్న ఈ రాజధాని నిర్ణయాన్ని పక్కన పెట్టేసి, మూడు రాజధానులు అంటూ ఆయన ముందుకెళ్లారు. న్యాయస్థానాల్లో ఇబ్బందులు ఎదురైనా, నాడు రాజధానికి భూములిచ్చిన రైతులు వ్యతిరేకించినా ఇప్పటివరకు రాజధానిపై తేల్చకుండా ముందుకు సాగుతున్నారు. అమరావతి శాసన రాజధాని, విశాఖకు పరిపాలన రాజధాని అంటూ ఆయన ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం విస్మయానికి గురిచేస్తున్నది. కొత్త నగర నిర్మాణంపై ఆయన తీసుకున్న నిర్ణయం విమర్శలకు కారణమవుతున్నది.

    15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు దేశంలో కొత్తగా ఎనిమిది నగరాలను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికోసం ప్రతిపాదనలు పంపాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం అమరావతిలో అన్ని వనరులు, అవకాశాలు ఉన్నా, మరో కొత్త పేర్లు ప్రకటిస్తూ ప్రతిపాదనలు పంపింది. సీఎం సొంత జిల్లా అయిన కడపలోని కొప్పర్తి పేరును తెరపైకి తెచ్చింది. శాసన రాజధానిగా అమరావతికి తొలి ప్రాధాన్యమివ్వాల్సిన సర్కారు కొప్పర్తి పేరు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

    కేంద్రం నిర్మించాలనుకున్న ఈ కొత్త నగరానికి రూ. 1000 కోట్ల మేర కేంద్రం నిధులు కేటాయిస్తుంద. ఏటా 250 కోట్లు ఇస్తుంది. అయితే అమరావతి అభివృద్ధి చేయాలనుకుంటే కేంద్రం ఇచ్చే నిధులను వాడుకోవచ్చు నాలుగేళ్లుగా అమరావతిని పక్కన పెట్టిన రాష్ట్రం ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ప్రస్తుతం ఆర్థిక సంఘం ప్రతిపాదనలతో వారు అమరావతిని అత్యద్భుతంగా తీర్చిదిద్దవచ్చు. అమరావతిని అభివృద్ధి చేస్తే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలకు దీటుగా తయారవుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకు వనరులు పుష్కలంగా ఉన్నాయని ప్రణాళికే ముఖ్యమని చెబుతూ వచ్చారు.

    కానీ రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా అమరావతిపై కక్షపూరితంగా ముందుకెళుతున్నదని అంతా అనుకుంటున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి అయినా ఈ నగరం నిర్మాణానికి అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

    అమరావతిలో కొత్త నగర నిర్మాణానికి సేకరణ సమస్య లేదు ఇప్పటికే అమరావతిలో భూసేకరణ పూర్తయింది మిగులు భూమి కూడా ఉంది. జల వనరులు, రవాణా సదుపాయాలు, నిధులు, రుణ అవకాశాలు పుష్కలంగా ఉన్నా, రాష్ట్రంలోని వైఎస్ జగన్ ప్రభుత్వం అమరావతిని నిర్లక్ష్యం చేయడం విమర్శలకు తావిస్తున్నది. ఏదేమైనా ఒక రాష్ర్ట భవిష్యత్  ను అంధకారం చేసేలా ఉన్న రెండు పార్టీల మధ్య వార్ ప్రజల మనోభావాలను పట్టించుకోవడం లేదు.

    Share post:

    More like this
    Related

    Surekhavani : మరో పెళ్ళికి సిద్ధం అవుతున్న సురేఖావాణి.. అందుకే అలాంటి ట్వీట్ చేసిందా?

    Surekhavani : ఇప్పుడు పవిత్ర లోకేష్ - నరేష్ ల జంట ఎంత...

    Late Marriages : ఆలస్యంగా పెళ్లిళ్లతో సంతాన సమస్యలు

    late marriages : ఇటీవల కాలంలో పెళ్లిళ్లు ఆలస్యం అవుతున్నాయి. కెరీర్...

    Eating Curd : ఎండాకాలంలో పెరుగు తింటే వేడి చేస్తుందా?

    Eating curd : ఎండాకాలంలో చాలా మంది పెరుగు తింటారు. కానీ...

    President plane : అరెయ్.. ఏంట్రా ఇదీ.. అధ్యక్షుడి విమానంతోనే ఆటలు

    President plane : అది అద్యక్షుడి విమానం. విమానంలో ఆయన లేరు....

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YS Viveka murder : వివేకా హత్య జగన్ కు ముందే తెలుసా.. సీబీఐ ఏం చెప్పింది..?

    YS Viveka murder : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి...

    YS Jagan : ‘నరకాసురుడు నైనా నమ్మొచ్చు కానీ చంద్రబాబును నమ్మొద్దు’

    YS Jagan : ఏపీ సీఎం జగన్ టీడీపీ అధినేత, విపక్ష నేత...

    Ten thousand crores in AP : ఏపీలో ఆ పది వేల కోట్లు ఏమయ్యాయి..?

    Ten thousand crores in AP : ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రాజెక్టు...

    Media house : మితీమీరుతున్న ఏబీఎన్ 

    టీడీపీ పుట్టి ముంచుతున్న మీడియా హౌస్ Media house : ఏపీ...