భారత చలనచిత్ర సీమలో తనదైన ప్రత్యేక స్థానాన్ని స్వయంకృషితో సంపాదించుకున్న అన్నయ్య చిరం జీవి కి పద్మ విభూషణ్ పురస్కారం వరించడం ఎనలేని సంతోషాన్ని కలిగించిందని పవన్ కళ్యాణ్ తెలి పారు. ఎంతో తపనతో చిత్రసీమలోకి అడుగుపెట్టిన అన్నయ్యకు తనకు వచ్చిన ప్రతి పాత్రను చిత్రాన్ని మనసుపెట్టి చేశారు కాబట్టి ప్రేక్షక హృదయాలను ఆయన గెలుచుకున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. అగ్ర శ్రేణి కథానాయకుడిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. సామాజిక సేవా రంగంలో అన్నయ్య చిరం జీవి చేస్తున్న సేవలు ఎందరికో ఆదర్శంగా నిలిచాయి. పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన శుభ సంద ర్భంగా చిరంజీవి అన్నయ్యకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపిక కావడం అభినందిం చదగ్గ విషయం అని పవన్ అన్నారు. విద్యార్థి నాయకుడు దశ నుంచి ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగిన వెం కయ్య నాయుడు సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్నారు. ఆయన వాగ్దాటి తెలుగు భాష పై ఉన్న పట్టు ఆసామాన్యమైనది కేంద్ర మంత్రిగా విశేషమైన సేవలు అందించారు. రాజకీయ ప్రస్థానం తోపాటు స్వ చ్ఛం ద సంస్థ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. వెంకయ్య నాయుడు గారికి స్ఫూ ర్తిగా అభి నందనలు తెలియజేస్తున్నాను. తెలుగు రాష్ట్రాల ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ నుంచి కళ సాహి త్య రంగాల నుంచి పలువురు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక కావడం సంతోషకరమన్నారు. మచిలీ పట్నా నికి చెందిన హరికథ కళాకారుని శ్రీమతి ఉమామహేశ్వరి, తెలంగాణ రాష్ట్రం నుంచి చిందు యక్ష గాన కళా కారుడు శ్రీ గడ్డం సమ్మయ్య, స్టపతి శ్రీ శ్రీ వేలు ఆనందాచారి, బుర్రవీణ వాయిద్య కారుడు శ్రీ దాసరి కొండ ప్ప, సాహితీ భాగం నుంచి శ్రీ కేతావత్ సోమ్లాల్, శ్రీ కూరెళ్ళ విఠలాచార్య, పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక కావడం ఆనందదాయకం అన్నారు. వారికి నా అభినందనలు పద్మ పురస్కారాలు ఎంపిక విషయంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం లో కేంద్ర ప్రభుత్వం అనుస రిస్తు న్న విధానం ప్రశం సలు అందుకొంటుందన్నారు. సామాజిక సేవ సాహిత్యం వ్యవసాయం ఇలా వివిధ రంగాల్లో స్ఫూర్తి దాయకమైన సేవలు చేస్తూ హీరోస్ గా ఉన్న వారిని గుర్తించి పద్మ అవార్డులతో గౌరవిస్తున్నారు ఈ పురస్కారాలకు ఎంపికైన ప్రతి ఒక్కరికి అభినందనలు.