the CM : కర్ణాటక సీఎం ఎవరో తేలిపోయింది. మరికాసేపట్లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖార్గే ఈ మేరకు ప్రకటన చేసే అవకాశం ఉంది. ఐదు రోజల ఉత్కంఠకు తెరిదించుతూ మరికొన్ని గంటల్లోనే కీలక ప్రకటన వెలువడనుంది. కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, సిద్ధరామయ్యల మధ్య పోటీ నేపథ్యంలో కొంత ఆలస్యమైందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
అయితే పార్టీ అధిష్టానం సిద్ధరామయ్య పేరును దాదాపు ఖరారు చేసినట్లుగా తెలుస్తున్నది. మరికాసేపట్లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖార్గే ప్రకటించనున్నారు. అయితే రేపే కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉంటుందని సమాచారం. ఇందుకు సంబంధించి ఇప్పటికే తన మిత్ర పార్టీల అగ్రనేతలకు ఆహ్వానాలు వెళ్లినట్లు తెలిసింది. పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు , పార్టీల అధ్యక్షులు ఈ వేడుకకు హాజరవుతారని తెలుస్తున్నది. అయితే సిద్ధ రామయ్య పేరు మరికాసేపట్లో ప్రకటించనున్న నేపథ్యంలో ఇప్పటికే ఆయన ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. హై సెక్యూరిటీ ని కల్పించారు. ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉండగా, సాయంత్రానికి బెంగళూరుకు చేరుకోనున్నట్లు సమాచారం. మరో నేత పీసీసీ చీఫ్ తో ఇప్పటికే పార్టీ పెద్దల మంతనాలు దఫాదఫాలుగా కొనసాగాయి.