తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రేపు గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయను న్నా రు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన రెండవ రోజే బాత్రూంలో కాలు జారి పడటంతో తుంటి ఎముక విరిగిన కేసీఆర్ కు యశోద ఆసుపత్రి వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించిన విషయం తెలి సిందే. తుంటి ఆపరేషన్ కావడంతో డాక్టర్ల సూచన మేరకు కేసీఆర్ గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుం టున్నారు.
ఇక ఇటీవల కాలంలో కర్ర సహాయంతో కేసీఆర్ నడవగలుగుతున్నారు. ఈ క్రమంలో కెసిఆర్ ఎమ్మెల్యేగా రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన మూడు శాసనసభ ఎన్నికలలో కెసిఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా తెలంగాణా రాష్ట్ర పాలన సాగించారు. కానీ ఈ దఫా కేవలం ఎమ్మెల్యేగానే పరిమితం కానున్నారు.
ఎమ్మెల్యేగా కెసిఆర్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అందరిని ఆహ్వానించారు. గజ్వేల్ నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఫిబ్రవరి ఒకటవ తేదీన తాను ప్రమాణ స్వీకారం చేస్తానని ఇప్పటికే శాసనసభాపతి అయిన గడ్డం ప్రసాద్ కు లేఖ రాసిన కెసిఆర్ శాసనసభకు వెళ్లి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవలే ఆయన కోలుకుని పలు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.