Naga Chaitanya:: చందూ మొండేటి దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య కాంబోలో తర్వాతి చిత్రాన్ని ప్రకటించారు. దీనికి టైటిల్ పేరు #NC23ని ఖరారు చేశారు. చందూ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు బన్నీ వాస్ భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఒక ఆసక్తికర రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
దర్శకుడు చందూ మొండేటి సాయి పల్లవిని ఇందులో హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారట. ఆమె నటన బాగుంటుందని అందుకే ఆమెనే తీసుకోవాలని అనుకుంటున్నాడట. అయితే ప్రొడ్యూసర్లు, టీం మెంబర్స్ మాత్రం ఎక్కువగా కీర్తి సురేశ్ వైపునకు మొగ్గు చూపుతున్నారట. సాయి పల్లవి కంటే కీర్తి సురేశ్ మేలని ఆయనకు ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారట. పైగా మహానటికి ఉత్తమ నటిగా అవార్డు కూడా అందుకుంది కీర్తి సురేశ్ అంటూ చెప్తున్నారట.
సాయి పల్లవి, కీర్తి సురేష్ ఇద్దరికీ కావాల్సినంత టాలెంట్స్ ఉన్నప్పటికీ నాగ చైతన్య, కీర్తి సురేష్ రిఫ్రెషింగ్ పెయిర్ కోసం కూడా పరిశీలనలో ఉంది. నాగచైతన్యతో కలిసి సాయి పల్లవి గతంలో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘లవ్ స్టోరీ’లో నటించారు. మహానటిలో నాగ చైతన్య, కీర్తి సురేశ్ నటించినా కొంచెం సమయం మాత్రమేు ఉంటుంది. దీంతో దర్శకుడు, టీం తర్జన భర్జన అవుతోంది. ప్రస్తుతానికి ఏదీ ఫైనల్ కాలేదని, త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు బయటకు వస్తాయని సమాచారం.