బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టీమిండియా పురుష,మహిళా క్రికెటర్లు హాజరై సందడి చేశారు. ఈ క్రమంలో భారత ప్లేయర్లు గ్రూప్ ఫోటో దిగారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రోహిత్, బమ్రా, అయ్యర్, గిల్, అశ్విన్, కేఎల్ రాహుల్, కుల్దీప్ తదితరులు ఈవెంట్ లో మెరిశారు.
వ్యక్తిగత కారణాలవల్ల కోహ్లీ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. అభిమాన క్రికెటర్లు అంతా ఇలా హైదరాబాద్ లో సందడి చేయడంతో క్రికెట్ అభిమానులు అనందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..అందరూ ఓక చోట ఇలా చేరి సందడి చేయడం సంతోషంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. బిసీసీఐ నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రామానికి భారత క్రికెటర్లు అందరూ పాల్గోన్నారు.. ఓక్క కోహ్లీ మాత్రం వ్యక్తిగత కారణాల వల్ల హాజరుకాలేదు. కోహ్లీ కుడా ఉండి ఉంటే చాలాబాగుండేదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.