అమెరికాలోని న్యూజెర్సీలో వైకుంఠ ఏకాదశి వేడుకలను ఎన్నారై భక్తులు ఘనంగా జరుపుకున్నారు. న్యూజె ర్సీలోని సాయిదత్తపీఠం శ్రీశివ విష్ణు దేవాలయం వేడుకలకు వేదికైంది. ఉదయం నుంచే స్థానిక ఎన్నారై భక్తులు హరి నామాన్ని స్మరించుకుంటూ ఉత్తర ద్వారం నుంచి దర్శించుకునేలా ఏర్పాట్లు చేశా రు. ఈ సం దర్భంగా వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యతను సాయిదత్త పీఠం నిర్వాహకులు రఘుశర్మ శంక రమంచి భక్తు లకు వివరించారు. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవత లతో కలిసి భూలోకంలోకి అడుగు పెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారు. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారని ఆయన తెలిపారు.