కడప జిల్లా ఇడుపులపాయ ఎస్టేట్ లో వైఎస్ షర్మిల తో వైఎస్ సునీతా రెడ్డి భేటీ కావడం తో రాజకీయంగా సర్వత్రా ఆసక్తి నెలకోంది. ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీలో సునీతా రెడ్డి చేరే అవకాశం ఉందని జోరుగా చర్చజ రుగుతుంది. గత కోద్ది రోజుల నుంచి సునీతా రెడ్డి తన తండ్రిని చంపిన వారికి శిక్ష పడాలని పోరాటం చే స్తూ వస్తుంది..ఈ నేపధ్యంలో ఆమె ఎంపీ అవినాశ్ రడ్డి,ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి పై అనుమానం పెట్టు కున్నారు..ఇప్పటికే వీరిద్దరిని సిబిఐ అధికారులు నింధితులుగా చేర్చిన సంగతి తెలిసిందే. అన్న తో విభేదించిన వైఎస్ షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరింది. జిల్లాల పర్యటనల్లో ఉన్న షర్మిల వైసిపి ప్రభుత్వం పై విమర్శలు సందిస్తూ ఉన్నారు.ఏపి లో రాజకీయ వేడి కోనసాగుతున్న నేపద్యంలో షర్మిల తో సునీతా రెడ్డి భేటీ కావడం తో వైసిపి వర్గాల్లో అలజడి మెదులు అయిందని బావిస్తున్నారు.