10th Class Exams : నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం అవు తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరుగుతాయి. ఏపీలో హాజరుకానున్న 7.25 లక్షల మంది విద్యార్థులు హాజరు కానుండగా అటు తెలంగాణలో 5.08 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
9:30 కంటే ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించమని అధికారులు ఇప్పటికే చెప్పారు. దూర ప్రాంతంలో ఉన్న విద్యార్థులు ముందస్తుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుందన్నారు.
ట్రాఫిక్ కారణంగా బస్సులు లేని కారణంగా పరీక్ష కేంద్రానికి లేటు వస్తే లోపలికర్మతించమని అధికారులు తెలిపారు. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను నిర్దేశించిన సమయాన్ని కంటే ముందుగానే పరీక్షహాలుకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎండాకాలం కాబట్టి పరీక్ష కేంద్రాల లోపల పిల్లలకు త్రాగేందుకు మంచినీటి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు.