YCP : తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఇటీవల భారీ మార్పుల జరిగాయి. కొత్తగా నియమకాల్లో ఏపీలోని జగన్ ప్రభుత్వం ఒక్క సామాజాకి వర్గానికే ప్రాధన్యమిచ్చిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మాత్రం ప్రభుత్వం స్పందించలేదు. తాజాగా మరో నియామకం కూడా అదే సామాజిక వర్గానికి దక్కింది. తిరుపతి నగరాభివృద్ధి సంస్థ చైర్మన్ గా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే ఇప్పడు మోహిత్ రెడ్డి టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యుడిగా కూడా ఉంటారు. వైసీపీ అధికారంలోకి వచ్చిననాటి నుంచి ఇప్పటివరకు తుడా చైర్మన్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెండుసార్లు పని చేశారు. ప్రస్తుతం ఆయన ప్రభుత్వంలో విప్ గా ఉన్నారు. ఇటీవల టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమించారు. ఇంతకుముందు రెండు పర్యాయాలు వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. ఇక భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి తిరుపతి కార్పొరేషన్లో రెండో డిప్యూటీ మేయర్ గా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తారని టాక్ వినిపిస్తున్నది.
ఇక ఈవో, జేఈవో, కలెక్టర్, తిరుపతి, చిత్తూరు ఎస్పీలు, తిరుపతి ఆర్డీవో, వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వీసీ, ఇలా అందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని ప్రభుత్వం నియమించింది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. వైసీపీలోని మిగతా సామాజిక వర్గాలకు చెందిన వారు కూడా దీనిపై రగులుతున్నట్లు సమాచారం. ఏదేమైనా ఇలా ఒకే సామాజిక వర్గానికి ప్రభుత్వం ఇంతలా ప్రాధాన్యం ఇవ్వడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.