జాతి రత్నాలు, ప్రిన్స్ లాంటి సినిమాలు తీసి స్టార్ డం సంపాదించుకున్న దర్శకుడు అనుదీప్. కొవిడ్ కాలంలో వచ్చిన జాతి రత్నాలతోనే అనుదీప్ సంచలనం సృష్టించాడు. ఈ సినిమానే ఆయనకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆయన కామెడీ జంద్యాల కామెడీని గుర్తు చేస్తుంది. కామెడీ సినిమాలపై మంచి పట్టు ఉన్న దర్శకుడిగా ఇండస్ట్రీ ఆయనను గుర్తించింది.
అయితే, మాస్ మహరాజ రవితేజకు, అనుదీప్ ఇటీవల స్క్రిప్ట్ వినిపించాడట. విన్న వెంటనే రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ పుకారు నిజమైతే, రవితేజ పూర్తి స్థాయి హాస్యభరిత చిత్రంతో మళ్లీ కనిపించబోతున్నాడు. ఆయన ఫుల్ లెంత్ కామెడీ సినిమాలు వచ్చి చాలా కాలం అయ్యింది. అప్పట్లో ‘కిక్’ సినిమా ఫుల్ లెంత్ కామెడీ గా వచ్చింది. ఆ తర్వాత అంత ఫుల్ లెంత్ కామెడీలో రవితేజ కనిపించలేదు.
ప్రస్తుతం రవితేజ ‘ఈగిల్’, హరీష్ శంకర్తో రీమేక్ సినిమా చేస్తున్నాడు. హరీష్ శంకర్ సినిమా చివరి దశకు చేరుకుంటుంది. ఇది పూర్తయిన వెంటనే అనుదీప్ తో సినిమా వర్క్ స్టార్ట్ చేస్తాడు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ‘ఈగిల్’ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.