Ravi Teja : రీసెంట్ గా హిట్ అయిన ‘టిల్లు స్క్వేర్’ నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ తన తర్వాతి ప్రాజెక్ట్ రవితేజతో ప్రకటించింది. ’#RG75’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి భాను బొగవరపు దర్శకత్వం వహించనున్నారు.
గతంలో వివాహ భోజనం (2021), సామజవరగమన (2023) వంటి చిత్రాలకు రచన చేసిన భాను రవితేజ హీరోగా ’#RG75’కు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘ఈ రోజు కోసం 11 ఏళ్లు ఎదురు చూశాను, ఎట్టకేలకు అది ఇప్పుడు వచ్చింది’ అంటూ దర్శకుడు భాను బోగవరపు తన ఎక్స్ (ట్విటర్) పేజీలో పోస్ట్ చేశాడు. నాకు మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్న వాళ్లు, వాళ్లందరికీ ‘థ్యాంక్యూ’ అంటున్నారు. మీరంతా గర్వపడేలా దర్శకత్వం వహిస్తా. ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నా’ అన్నారు.
‘#RG75’ సంక్రాంతి-2025కి విడుదల చేయనున్నట్లు తెలిపారు. శ్రీఖర స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని, కూర్పు: నవీన్ నూలి, తదితరులు ఉన్నారు.
ఆర్టీ 75తో పాటు అజయ్ దేవగణ్ నటించిన రైడ్ (2018) అధికారిక రీమేక్ అయిన మిస్టర్ బచ్చన్ లో కూడా రవితేజ కనిపించనున్నారు. కొంత కాలంగా రవితేజకు అస్సలు కలిసి రావడం లేదు. తాను చేస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాపులు అవుతున్నాయి. ఇటీవల వచ్చిన ‘ఈగల్’ కొంత మేరకు పర్వలేదు అన్నట్లు కనిపించినా. భారీ బాక్సాఫీస్ కలెక్షన్లను మత్రం సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో ‘#RG75’పై చాలా ఆశలు పెట్టుకున్నారు రవితేజ. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుందని తెలుస్తోంది.