Asia Cup Squad: ఆసియా కప్ కోసం రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కేఎల్ రాహుల్ కు గాయం కావడంతో అతడిని దూరం చేసింది. శ్రేయస్ అయ్యర్ కు కూడా టీమిండియాలో చోటు దక్కింది. హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మను సైతం ఆసియా కప్ కోసం ఎంపిక చేశారు. సూర్య కుమార్ యాదవ్ ను కూడా సెలెక్ట్ చేశారు. దీంతో జట్టు కూర్పుపై విమర్శలు బహిరంగంగానే వస్తున్నాయి.
ఆగస్టు చివరి నుంచి ప్రారంభం కానున్న మెగా టోర్నీ కోసం ఎంపిక చేసిన జట్టులో ఎక్కువ మంది ముంబై ఇండియన్స్ సభ్యులే ఉండటంతో మినీ ముంబై ఇండియన్స్ గా నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. సెలెక్టర్ల నిర్ణయం తప్పుబడుతున్నారు. ముంబై ఇండియన్స్ సభ్యులను ఎంపిక చేయడంతో విమర్శలు మూటగట్టుకుంది. అందరు దీనిపై విమర్శలు చేయడంతో మరోమారు బీసీసీఐ అప్రదిష్ట పాలవుతోంది.
ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయంతో అందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటగాళ్ల ఎంపికపై తమదైన శైలిలో మండిపడుతున్నారు. ముంబై లాబీయింగ్ బలంగా పనిచేసిందని గుర్తు చేస్తున్నారు. జట్టులో ముంబై ఆటగాళ్లు ఆరుగురు, ముగ్గురు గుజరాత్ ఆటగాళ్లు ఉన్నారు. మిగతా వారంతా ముంబై ఇండియన్స్ లాబీ నడిచిందనే వాదనలు వస్తున్నాయి.
రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, జస్ప్రీత్ బుమ్రా ముంబై ఆటగాళ్లు, హార్థిక్ పాండ్యా కూడా ముంబై తరఫున ఆడాడు. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, బుమ్రా గుజరాత్ ఆటగాళ్లు. శార్దుల్ ఠాకూర్, శ్రేయస్ అయ్యర్ ముంబై ఆటగాళ్లే. మెగా టోర్నీలో సత్తా చాటిన శిఖర్ ధావన్ కు చోటు దక్కకపోవడం నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.