Bandla Ganesh :
టాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పేరొందిన నటుడు, నిర్మాత బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ పేరెత్తితేనే ఊగిపోతుంటాడు. నా దేవుడు పవన్ కల్యాణ్ అంటూ పలు సినిమా వేదికలు, ఫంక్షన్లలో పొగుడుతూ తన స్వామి భక్తిని చాటుకుంటుంటాడు. పలు సందర్భాల్లో పవన్ ఎదుట ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి.
పవన్ కల్యాణ్ భక్తుడినని చెప్పుకునే బండ్ల గణేష్.. అవకాశం దొరికిన ప్రతి సారి పవర్ స్టార్ని ఆకాశానికెత్తుతుంటారు. బండ్ల గణేష్ నిర్మాతగా పవన్ కల్యాన్ తో తీసిన తీన్మార్ సినిమా ప్లాఫ్ అయితే గబ్బర్ సింగ్ సినిమాకు మరో అవకాశం ఇచ్చాడు. ఈ సినిమాతో బండ్ల గణేష్ టాప్ ప్రొడ్యూసర్ గా నిలిచాడు. సినిమా వేదికల్లో పవన్ కల్యాన్ పేరెత్తకుండా బండ్ల గణేష్ స్పీచ్ నడవదు.
అయితే ప్రస్తుతం ఓ టీవీ చానెలో జరిగిన డిబేట్ లో బండ్ల గణేష్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాన్ చేస్తున్న వారాహి యాత్రపై స్పందించారు. అలాగే ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేల వైఖరిపైనా తన స్పందనను తెలియజేశారు. పవన్ కల్యాణ్ తన సినిమాలు, కోట్ల రూపాయల సంపాదనను విడిచి ప్రజాసేవ జనాల్లోకి వెళ్తు్న్నాడని చెప్పారు. తనను సినిమాల్లో, టీవీల్లో చూడాల్సిందే తప్ప నేరుగా కలవడం కష్టమని, అంతటి వ్యక్తి తనకున్న అన్ని సౌకర్యాలను వదులుకున్నాడని చెప్పారు. ఏపీ మంత్రులు మాత్రం జగన్ దగ్గర మెప్పు పొందేందుకు పవన్ కల్యాణ్ పై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. స్థాయికి మించి విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఏపీ మంత్రుల మాట తీరు పైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. బూతులు, భాషపైనా మండిపడ్డారు. వ్యక్తిగతంగా కించపర్చడం సరికాదన్నారు. పవన్ వ్యక్తిగత విషయాలను ఏపీ మంత్రులు లాగడం సరికాదన్నారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఏమిటో చెప్పుకోవాలే తప్ప వ్యక్తిగత విమర్శలు వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. తాజాగా ఏపీ మంత్రులపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పవన్ కల్యాణ్పై ఈగ వాలినా కూడా బండ్ల గణశ్ ఊరుకోరు. తప్పుడు పోస్టులు పెట్టినా వెంటనే రియాక్ట్ అవుతూ కౌంటర్లు వేస్తుంటారు. ఈ క్రమంలోనే బండ్లన్న మరోసారి ఇలా రియాక్ట్ అయ్యారు.
ReplyForward
|