15 ఏళ్ల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ అధికారులు మరోసారి దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే ఈ కేసును ఏపీ పోలీసులతో పాటు సీఐ డీ, సీబీఐ దర్యాప్తు చేసాయి. ఈ కేసులో కొన్నేళ్లపాటు జైలు జీవితం గడిపిన సత్యంబాబును నిర్దోషిగా కోర్టు తేల్చడంతో.. దర్యాప్తు మళ్ళీ చేయాలని సుప్రీం కోర్ట్ సీబీఐ నీ ఆదేశించింది దింతో మరోసారి దర్యాప్తును సీబీఐ దర్యాప్తును ప్రారంభించింది. ఆయేషా మీరా హత్య జరిగిన సమయంలో.. నందిగామ డీఎస్పీగా పని చేసి.. ప్రస్తుతం తెలంగాణలో జాయింట్ సీపీగా పనిచేస్తున్న శ్రీనివాస్ నుంచి సీబీఐ మరోసారి సమాచారం సేకరిస్తోంది. ఆయేషా హత్య కేసులో సాక్షులుగా వున్న వారిని.. మరోసారి స్క్రూటినీ చేస్తోంది.
ఆయేషా మీరా కేసుపై గతంలో దర్యాప్తు చేసిన అధికారులతో పాటు దర్యాప్తు సంస్ధలు కూడా అసలు నిందితుల్ని పట్టుకోవడంలో విఫలమయ్యాయి. ఈ కేసులో సత్యంబాబును అరెస్ట్ చేసినా కోర్టులో దోషిగా నిర్ధారించలేదు.అయేషామీరా హత్య చేయబడి ఇటీవలే 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆమె తల్లి మీడియాతో మాట్లాడారు. అయేషామీరాను హత్య చేసిన నిజమైన హంతకులను శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.
ఆయేషామీరా హత్య కేసు ను ఐపీఎస్ అధికారులు ఆనంద్, ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తప్పు దోవ పట్టించారని అయేషా మీరా తల్లి శంషాద్ బేగం ఆరోపించారు. మా దగ్గర ఉన్న అన్ని వివరాలు సీబీఐకి ఇచ్చాం. మేము సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తాం. అసలైన దోషులకు శిక్ష పడి..న్యాయం జరిగే వరకూ ముందుకు సాగుతామన్నారు.
అయితే 2018లోనే ఆయేషా మీరా కేసును సీబీఐకి అప్పగించారు. కానీ సీబీఐ మాత్రం నత్తనడకన ఈ కేసును దర్యాప్తు చేసింది. అసలైన నిందితుల్ని పట్టుకోవడంలోనూ విఫలమైంది. దీంతో సుప్రీంకోర్టు జోక్యంతో ఈ కేసు తిరిగి దర్యాప్తు చేయాల్సిన పరిస్ధితి ఎదురైంది.