Chandrababu – JP Nadda : ఎన్టీఆర్ రూ. 100 నాణెన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ర్ట పతి ద్రౌపది ముర్ము ఈ నాణెన్ని విడుదల చేశారు. రాష్ర్ట పతి భవన్ లో ఈ కార్యక్రమం నిర్వహించగా, అన్న ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. అట్టహాసంగా ఈ కార్యక్రమం నిర్వహించగా, తెలుగు వారందరూ గర్వించేలా నాణెన్ని విడుదల చేశారు.
కాగా, ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ ఎంపీ రఘురామరాజు తదితరులు హాజరయ్యారు. నడ్డా, చంద్రబాబు పక్కపక్కనే కూర్చొని సమాలోచనలు జరిపారు. పొత్తులకు మార్గం సుగమం అయినట్టే వీరిద్దరూ మాట్లాడుకున్నారు. సమావేశం అనంతరం కూడా బాబు, నడ్డా కలిసి తేనేటి విందులో రాష్ట్ర రాజకీయాలు, పొత్తులపై మాట్లాడుకోవడం విశేషం.
సభా వేదికపై ఎన్టీఆర్ కుమారులు, కూతుళ్లకు మాత్రమే చోటు కల్పించారు. అలాగే కుటుంబం తరఫున కుమార్తె పురందేశ్వరికి మాత్రమే మాట్లాడేందుకు అవకాశం కల్పించారు. ఇక రాష్ర్టపతి ద్రౌపది ముర్ము మాట్లాడారు.