CSK Champion : ఐపీఎల్ 16 సీజన్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. సొంత రాష్ర్టంలోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఫైనల్ ఆడుతున్న గుజరాత్ టైటాన్స్ ను ఓడించింది. అయితే ఈ విజయంలో ధోని పాత్ర కీలకమనేది అందరికీ తెలిసిందే. అయితే ఈ సారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అంత సీనియర్ ఆటగాళ్లే ఉన్నారు.
2020 ఐపీఎల్ ను కింది నుంచి రెండో స్థానంలో ముగించిన చెన్నై జట్టు ఈ సారి అంచనాల్లేవ్. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సారి టైటిల్ ను పట్టేసింది. ఇందులో ధోనీ పాత్ర కీలకం. అసలు ఐపీఎల్ సెలక్ట్ కాడనుకున్న రహానెను జట్టులోకి తెచ్చి, పలు అద్బుతమైన మెరుపు ఇన్సింగ్ లను ఆడించాడు. జట్టుకు మెరుపు విజయాలు అందించాడు. మిగతా ఆటగాళ్లను కూడా వారి స్థాయికి తగ్గట్లుగా వాడుకొని జట్టును ఫైనల్ వరకు చేర్చాడు. శివమ్ దూబే, రహానె, పతిరమన లాంటి ఆటగాళ్లు చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో కీలక విజయం సాధించారు..
ధోని మార్క్ విజయం..
వర్షం కారణంగా రిజర్వ్ డే మ్యాచ్ నిర్వహించారు. అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అని అందరిలో టెన్షన్. మ్యాచ్ ప్రారంభం కావడం టాస్ గెలిచిన ధోని గుజరాత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించడం చకచకా జరిగిపోయాయి.కాని గుజరాత్ కూడా దీటుగా ఆడి 215 పరుగులు చేదన లక్ష్యాన్ని సీఎస్కే ముందుంచింది.అయితే వర్షం కారణంగా రెండున్నర గంటలు మ్యాచ్ నిలిచిపోవడంతో సీఎస్కే ముందు 15 ఓవర్లలో 171 పరుగుల లక్ష్యాన్ని నిర్ణయించారు. దీంతో మైదానంలోకి దిగిన సీఎస్కే ఓపెనర్లు ముందునుంచే చెలరేగి ఆడారు.
ఇక ఆఖరి ఓవర్లో చెన్నైకి 13 పరుగులు కావాలి. మోహిత్ బౌలింగ్ కు వచ్చాడు. మొదటి నాలుగు బంతుల్లో నాలుగు పరుగులు ఇచ్చాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి ఖాయమనుకున్న దశలో ఐదో బంతికి జడేజా సిక్సర్ కొట్టాడు. ఆఖరి బంతిని ఫైన్ లెగ్ మీదుగా బౌండరీ దాటించి జట్టుకు విజయాన్ని అందించాడు. ఆఖరి బంతి వ రకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో చివరకు విజయం సీఎస్కే ను వరించింది. దీంతో సీఎస్కే అభిమానుల్లో సంబురం అంబరాన్నంటింది.