Devineni Avinash : కృష్ణలంక 20,21వ డివిజన్ల ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న తూర్పు నియోజకవర్గ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి దేవినేని అవినాష్. ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు అని అన్నారు.రాష్ట్ర చరిత్రలో మైనారిటీలకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదే.. కుటుంబసభ్యుల్లాంటి ముస్లిం సోదరులు సుఖసంతోషాలతో ఉండాలని అల్లాహ్ ను కోరుకుంటున్నా అని అన్నారు.రాష్ట్ర ప్రజల కోసం,ప్రత్యేకంగా ముస్లిం, మైనారిటీల అభివృద్ధికి నిరంతరం పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అల్లాహ్ ఆశీస్సులు మెండుగా ఉండాలని ప్రార్ధిస్తున్నాను అని అన్నారు.ముస్లిం సోదరసోదరీమలు అందరికి రంజాన్ శుభాకంక్షాలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలోవక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ మీర్ హుస్సేన్,ఎన్టీఆర్ జిల్లా వక్ఫ్ బోర్డ్ వైస్ చైర్మన్ సుబాని,ముస్లిమ్ సోదరులు బాషా,రఫీ,జరక్ పాల్గొన్నారు
Breaking News