Devineni Avinash :వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన తరువా త ఎన్నికల మాన్యుఫెస్టోలో చెప్పిన విధంగా 95 శాతం పైగా హామీలు అమలు చేసిన దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పేర్కొన్నారు.
నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్ నందు రాణిగారి తోట,సంగుల పెరయ్య స్ట్రీట్,మిరియాల వారి స్ట్రీట్ ప్రాంతాలలో గడప గడపకి వెళ్లి ఈ నాలుగున్నర ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమా భివృద్ధి కార్యక్రమాల గురుంచి వివరించి, అభివృద్ధి కార్యక్ర మాలు ముద్రించిన కరపత్రా లను పంపెనీ చేశారు.
అధికారంలోకి వచ్చిన తరువా త ఈ డివిజన్ లో 35కోట్లరూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడం జరిగిందన్నారు.,
గత 15 రోజులుగా ఈ డివిజన్ లో ప్రతి ఇంటికి వెళుతుంటే ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యం గా మహిళలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వాళ్లకు కలిగిన లబ్ది గురుంచి సంతోషంగా చెబుతూ వారి కృతజ్ఞతలు తెలియజేస్తుంటే చాలా గర్వంగా ఉంది అన్నారు.
స్వర్గీయ వైయస్సార్ గారు పేద ప్రజల సంక్షేమం కోసం ఒక అడుగు వేస్తే ఆయన తనయు డు జగ న్మోహన్ రెడ్డి గారు పది అడుగులు ముందుకు వేసి దమ్మున్న ముఖ్యమంత్రిగా నిలిచారని, రాబోయే ఎన్నికల కు మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.