Megastar Chirajeevi : మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అందించిన కేంద్రం తనను తాను సత్కరించుకుంది. మహోన్నత వ్యక్తిత్వం, నటనపై ఉన్న శ్రద్ధ, కళామతల్లికి చేసిన సేవకు ప్రతిఫలంగా ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఆయనను అనగదొక్కేందుకు చాలా మంది చాలా ఎత్తులు వేశారు. చాలా విమర్శలు చేశారు. వీటన్నింటికి ఆయన మౌనంగా సమాధానం చెప్పారు.
పద్మ విభూషణ్ తర్వాత చిరంజీవి తొలిసారిగా మెగాహీరో వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలంటైన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు. సింపుల్ గా ఉండేందుకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు మెగాస్టార్. ఈవెంట్ కు కూడా చాలా సింపుల్ గానే వచ్చారు. కానీ అందరి దృష్టి ఆయన పెట్టుకున్న వాచీపై పడింది. అది ఏ కంపెనీ, దాని ధర ఎంత అని ఆయన ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సాధారణ నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవి.. మెగాస్టార్ రేంజ్ కు ఎదిగారు. 150కి పైగా సినిమాలు చేసి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఆయన వద్ద ఉన్న కార్లు, వాచీలు చాలా లగ్జరీగానే ఉంటాయి. రోలక్స్ వాచీలు ఉన్న ఆయనకు రోల్స్ రాయ్ అనే కారు కూడా ఉంది. అదే కారులో ఆయన బయటకు వెళ్తాడు. ఆ ఫొటోలు వైరల్ గా మారాయి.
వరుణ్ కొత్త సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో కనిపించిన చిరు.. ఏ లాంజ్ & సోహ్నే అనే బ్రిటీష్ కంపెనీ వాచ్ వాడుతున్నారు. దీని ధర గురించి ఆరా తీస్తే షాకింగ్ విషయాలు తెలిశాయి. ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.50,56,747 అని తెలుస్తోంది. అంటే అరకోటికి పైమాటే.
ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’లో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్తో వస్తున్న ఈ మూవీ.. 2025 సంక్రాంతి కానుకగా రీలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.