Biryani : బిర్యాణీ అంటే అందరికి ఇష్టమే. రోజు తినమన్నా తింటారు. బిర్యాణీ తినేటప్పుడు నిమ్మకాయ, పచ్చి ఉల్లిపాయను నంచుకుని తినడం అలవాటే. రెస్టారెంట్లో ఇవి లేకపోతే బిర్యాణీ తినరు. ఇలా బిర్యాణీ తినడంలో మనం వాడే ఉల్లిపాయల వల్ల కొన్ని రకాల నష్టాలున్నాయనే సంగతి ఎవరికి తెలియదు. పచ్చి ఉల్లిపాయను బిర్యాణీతో తినడం వల్ల మనకు కొన్ని ఇబ్బందులు వస్తాయి.
బిర్యాణీతో పాటు పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల ఎంజాయ్ చేస్తాం కానీ ఆరోగ్యానికి హానికరమే. ఇలా తినడం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు. ఏదైనా మితంగా తింటేనే మంచిది. పచ్చి ఉల్లిపాయలు తినడంవల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. పలితంగా మనకు అజీర్తి సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది పేగులపై ప్రబావం చూపుతుంది.
పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల కడుపులో నొప్పి వస్తుంది. దీని వల్ల నోటిలో దుర్వాసన ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. దీంతో పాటు ఎసిడిటి సమస్య పెరుగుతుంది. గర్భిణులు పచ్చి ఉల్లిపాయ తింటే వాంతులు, గుండెలో మంట పుడుతుంది. ఇందులో ఉండే పొటాషియం కాలేయం పనితీరును మందగించేలా చేస్తుంది. మలబ్ధకం సమస్య కలుగుతుంది. ఇవే కాకుండా ఇతర సమస్యలు కూడా వస్తాయి.
బిర్యాణీ తినేటప్పుడు పచ్చి ఉల్లిపాయకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం. ఇది తెలియని చాలా మంది పచ్చి ఉల్లిపాయను తెగ తింటుంటారు. వీటిని తినడం వల్ల అనారోగ్యం ఏర్పడుతుందనే అవగాహన ఉండదు. దీంతో మనం పలు నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పచ్చి ఉల్లిపాయను తినకుండా జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదని తెలుసుకోవాలి.