Pawan kalyan పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో సాయిధరమ్ తేజ్ తో కలిసి నటించిన సినిమా బ్రో. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్ల నిర్మాతలు. తమిళంలో విజయవంతమైన వినోదయ సీతమ్ ఆధారంగా సినిమాను సముద్రఖని దర్శకత్వంలో నిర్మించారు. పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ తొలిసారిగా కలిసి నటించారు. సినిమా గురించి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ సినిమా ఎమోషనల్ గా తీశారని గుర్తు చేశారు. సినిమా ప్రీ రిలీజ్ సంద్భంగా పవన్ మదిలోని మాటలు బయటపెట్టారు.
సినిమాల్లోకి వస్తానంటే..
బ్రో సినిమా సాయిధరమ్ తేజ్ కు ప్రత్యేకమైనదని పవన్ కల్యాణ్ చెప్పారు. మొదట సినిమాల్లోకి రావాలని ఉందని సాయిధరమ్ అడిగితే ఏం చెప్పలేకపోయాను. వద్దని వారించలేదు. రావాలని ఆహ్వానించలేదు. ఆయన శక్తిని ఆయనే బయట పెట్టుకోవాలని చూశాను. యాక్టింగ్ స్కూల్ లో చేర్పిస్తే మంచి నైపుణ్యం ప్రదర్శించడంత వైవీఎస్ చౌదరి అవకాశం కల్పించారు.
12 గంటలు
ఈ సినిమాకు ముందు త్రివిక్రమ్ నేను కలిసి ఉన్న సమయంలో సాయిధరమ్ కు ప్రమాదం జరిగిందని ఫోన్ వచ్చింది. దీంతో ఇద్దరం ఆస్పత్రికి వెళ్లి చూశాం. సాయి 12 గంటలు కోమాలోనే ఉన్నాడు. తరువాత తెలివికి వచ్చాక కూడా సరిగా మాట్లాడలేదు. బ్రో సినిమాలో హీరోగా ఎవరిని తీసుకోవాలని అనుకుంటే సాయి పేరును త్రివిక్రమ్ సూచించాడు. మరి ఆక్సిడెంట్ అయింది కదా అంటే కోలుకునే వరకు ఆగుదామని చెప్పాడు. అలా బ్రో సినిమా వచ్చింది.
జగన్మాతకు ప్రార్థన
ఇక దర్శకుడు సముద్రఖని సాయి కోసం ఎంతో రిస్క్ తీసుకున్నాడు. తన సొంత వాడిలా భావించి చూసుకోవడం సంతోషం అనిపించింది. సాయిధరమ్ కు ప్రమాదం జరగడంతో త్వరగా కోలుకోవాలని ఆ జగన్మాతను వేడుకున్నాను. అతడిని బతికించాలని భగవంతుడిని ప్రార్థించాను. అలా సాయి కోసం పవన్ కల్యాణ్ అంత శ్రద్ధ తీసుకున్నాడు. ఓ మూల కూర్చుని కోలుకోవాలని పూజించానని పేర్కొన్నాడు.