ఆ యువతి ప్రేమ కోసం హల్ చల్ చేసింది. శ్మశాన వాటికలో కూర్చుని ఏడ్చింది. దీంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. తనను ప్రేమించిన వాడు వదిలేశాడని ఇక తనకు ఆత్మహత్యే శరణ్యమని బాధపడింది. దీంతో వారి తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో వారు వచ్చిన తరువాత వారిని కూర్చోబెట్టి కౌన్సెలింగ్ చేశారు.
ఇరవై ఏళ్లు పెంచిన తల్లిదండ్రులను కాదని ఎవడో ప్రేమించిన వాడికోసం తన శరీరాన్ని విడిచిపెట్టాలనే భావన రావడంపై అందరు ఆశ్చర్యపోయారు. పేరెంట్స్ కోసం ఏ త్యాగం చేయని పిల్లలు ఇలా ప్రేమించిన వాడి కోసం సర్వస్వం వదులుకోవాలని చూడటం గమనార్హం. ప్రేమిస్తే ప్రాణాలు వదలాలా? అంతటి గాఢమైన ప్రేమా? ఏం చూసి ప్రేమించింది? అతడు అంతటి సుగుణాలున్నవాడా? అనే అనుమానాలు అందరు వ్యక్తం చేస్తున్నారు.
ఈనేపథ్యంలో యువతి చేసిన పనికి అందరు తిడుతున్నారు. ఇలా తల్లిదండ్రులను బాధపెట్టడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. హాయిగా చదువుకుని జీవితంలో ఎదగడానికి ప్రయత్నించాలి కానీ ఇలా ప్రేమించిన వాడి కోసం ప్రాణాలు తీసుకుంటానని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. ఈ రోజుల్లో పిల్లలు ఇలాంటి వ్యవహారాల్లో మునగడం తప్పుదారుల్లో నడుస్తున్నారని పేరెంట్స్ బాధపడుతున్నారు.
ఇన్నేళ్లు పెంచిన మమకారం లేకుండా ఇప్పుడు పరిచయమైన అతడి కోసం తన ప్రాణాలు తీసుకోవాలనుకున్న ఆమె తీరును మందలించారు. ఇలా చాలా మంది ఆకర్షణకు గురవుతున్నారు. అదే ప్రేమగా భావించుకుంటున్నారు. దీంతో లేనిపోని సమస్యల బారిన పడుతున్నారు. ఈ ధోరణి పోవాలి. ప్రతి వారికి బతుకు దెరువు మీదే చూపు ఉండాలి. తల్లిదండ్రుల మీదే ప్రేమ పెంచుకోవాలి.