రానురాను మనుషుల్లో సహనం నశిస్తోంది. కోపం పెరుగుతోంది. ఫలితంగా ఏం చేస్తున్నారో తెలియడం లేదు. పెళ్లి కోసం ఎన్నో ఏళ్లు ఎదురు చూసే యువత విడాకుల కోసం ఆగడం లేదు. మనస్పర్దల కారణంగా ఎన్నో జంటలు విడాకులు తీసుకుంటున్నాయి. తెంచుకుంటె తెగిపోతుందా దేవుడు వేసిన బంధం అన్నారో సినీకవి. భార్య విలువ తెలిసినవాడైతే విడాకులు తీసుకోడు. భార్యపై బాధ్యత ఉన్న వాడు విడిపోవడానికి సంకల్పం చేయడు. మనసా వాచా కర్మనా పెళ్లాడిన భార్యను విడిచిపెట్టడం మంచిది కాదనే విషయం తెలియక చాలా మంది పొరపాట్లు చేస్తున్నారు. పాశ్చాత్యులే మన ఆచారాలను గౌరవిస్తుంటే మనం మాత్రం విదేశీయుల అలవాట్లకు బానిసలం అవుతున్నాం. దీంతోనే విడాకుల సంఖ్య పెరుగుతోంది.
ఇటీవల కాలంలో విడిపోతున్న జంటలు పెరుగుతున్నారు. చిన్న కారణాలకే తమ భార్యలను వదిలేస్తున్నారు. దీంతో పచ్చని కాపురంలో నిప్పులు పోసుకుంటున్నారు. కడదాకా తోడుంటానని బాస చేసిన వాడే మధ్యలో వదిలేస్తున్నాడు. దీనిపై మనం స్పందించకపోతే భవిష్యత్ లో ఈ పరిణామాలు ఎక్కడకో దారి తీస్తాయి. అసలు వారు విడిపోవడానికి కారణాలేంటో తెలిస్తే మనం ఆశ్చర్యపోవడం ఖాయం.
లైంగిక సామర్థ్యం తగ్గిందనే ఉద్దేశంతోనే చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు. ప్రస్తుత తరుణంలో కెరీర్ నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. చేసే పనిలోనే దైవత్వాన్ని వెతుక్కుంటున్నారు. ఇది మంచిదే. కానీ కట్టుకున్న భార్యను కూడా పట్టించుకోవాలి. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. లైంగిక వాంఛలు తగ్గడం వల్లే చాలా జంటలు విడిపోతున్నట్లు తెలుస్తోంది.
కట్టుకున్న ఆలికి కూడా కాస్త సమయం ఇవ్వాల్సిందే. మనం చేసే పనిలో బిజీగా ఉండి ఆమెను పట్టించుకోకపోతే ఆ పాపం మనదే. అందుకే భార్యలను కూడా ప్రేమించాలి. వారికి సమయం ఇవ్వాలి. వారితో ఏకాంతంగా గడపాలి. దీంతో వారిలో కూడా ప్రేమ పుడుతుంది. దీన్ని అందరు గమనించుకుంటే ఇలాంటి విడాకుల సమస్య ఉండదు.