Venkaiah Naidu – Revanth Reddy : తానా పండుగ అమెరికాలో అంబరాన్ని అంటుతోంది. ప్రవాస భారతీయులు తెలుగు వారి పండుగలా ఘనంగా నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా తానా ఎన్నికలు సైతం జరుగుతున్నాయి. వెంకయ్య నాయుడు, రేవంత్ రెడ్డి లాంటి ప్రముఖ రాజకీయ నేతలు.. బాలకృష్ణ లాంటి ప్రముఖ హీరోలు సైతం ఈ వేడుకకు హాజరయ్యారు.
తానా మహాసభలకు అమెరికాకు వచ్చిన మాజీ ఉపరాష్ట్రపతి, తెలుగు వ్యక్తి వెంకయ్య నాయుడు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో యూబ్లడ్ ఫౌండర్ జై, డా. జగదీష్ బాబు యలమంచిలి గారు గౌరవంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. భారత దేశానికి, తెలుగు వారికి ఎంతో సేవ చేసిన వెంకయ్య నాయుడిగారి సేవలను జై గారు కొనియాడారు.
ఈ సందర్భంగా జై గారి సేవా కార్యక్రమాలను వెంకయ్య అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ జై గారు యూబ్లడ్ తో ఎంతో మందికి ప్రాణదాతగా మారుతున్నారు. ఆయన సేవలను వెంకయ్యనాయుడు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి సైతం అభినందించారు. వెంకయ్య, రేవంత్ రెడ్డిలను కలుసుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా జై గారు అభిప్రాయపడ్డారు.
తానా సభ్యుల సేవా కార్యక్రమాలను ఈ సమ్మేళనంలో వెంకయ్య ప్రస్తావించి కొనియాడారు. ప్రవాస భారతీయులు ఖ్యాతిని అమెరికాలో ఇనుమడింప చేస్తున్నారని ప్రశంసించారు.
ఈ సమావేశంలో టీడీపీ నేతలు, ప్రవాస ప్రముఖులు కూడా పాల్గొన్నారు.