కేసీఆర్కు గద్దర్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.రాబోయే ఎన్నికల్లో గజ్వేల్ బరిలో ఉంటానని ప్రకటించారు. అన్ని విపక్ష పార్టీలు తనను ఉమ్మడి అభ్యర్థిగా పెడితే సంతోషిస్తానని చెబుతున్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్పై పోటీ చేస్తానని అంటున్నారు ప్రజాయుద్ధ నౌక గద్దర్.
మంగళవారం గద్దర్ మెదక్ జిల్లా తూప్రాన్లో విలేకర్లతో మాట్లాడుతూ..ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను 76 సంవత్సరాలు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇక నుంచి తాను పుట్టిన ఊరిలోనే ఉండాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. తమ గ్రామంపై ఉన్న మమకారానికి గుర్తుగా ‘మై విలేజ్ ఆఫ్ ది 60 ఇయర్స్’ అనే బుక్ను కూడా రాసినట్లు వెల్లడించారు. ఈ పుస్తకంలో తన అనుభవాలు, తాను ఎదుర్కోన్న భావాలను షేర్ చేసుకున్నట్లు వివరించారు.
ఇక గద్దర్ మంగళవారం తూప్రాన్లో చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. రానున్న ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తే గజ్వేల్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ ప్రస్తుతం సీఎంగా ఉన్నారు.గజ్వేల్ సెగ్మెంట్లో మంచి అభివృద్ధి చేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో జరిగిన డెవలప్మెంట్ స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే గద్దర్ సీఎం కేసీఆర్పై పోటీ చేస్తానని మంగవారం మీడియా ప్రతినిధులకు చెప్పడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి గజ్వేల్ నియోజకవర్గంపై గద్దర్కు ఎంత మాత్రం పట్టులేదు. ఆయనది గజ్వేలే సెగ్మెంట్లోని తూప్రాన్ అయినప్పటికీ..ఏనాడు కేసీఆర్కు వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసిన సందర్భాలు లేవు.ఈ నేపథ్యంలోనే గద్దర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా హాస్యాస్పదంగా మారాయనే వాదనలు వినిపిస్తున్నాయి.