Gunturu Kaaram : ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హవా చేస్తున్న సాంగ్ ‘గుంటూరు కారం’ నుంచి ‘కుర్చీని మడతపెట్టి..’ త్రివిక్రమ్ శ్రీనివాస్-మహేశ్ బాబు కాంబోలో వస్తున్న సినిమా ఇది. ఈ మూవీపై మహేశ్ అభిమానులు తీవ్రంగా ఆశలు పెట్టుకున్నారు. సరే ఇవన్నీ పక్కన ఉంచితే ఇందులో ఒక పాట ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ మూవీలో సాంగ్ ను రిలీజ్ చేసింది యూనిట్. అందులో ఫేమస్ డైలాగ్ ‘కుర్చీని మడతపెట్టి..’ అంటూ ఒక సాంగ్ ఉంది. అయితే పూర్తి సాంగ్ ఇది కాకపోయినా కోరస్ గా వస్తుంది. దీన్ని విన్న చాలా మంది భిన్నంగా కామెంట్లు చేస్తున్నారు. తమన్ సంగీతంలో వచ్చిన ఈ సాంగ్ ఇప్పుడు వైరల్ గా మారింది.
ఈ సాంగ్ నిన్న (డిసెంబర్ 30) శనివారం మధ్యాహ్నం రిలీజైంది. రిలీజైన ఒక్క రోజు గడవకముందే యూ ట్యూబ్ లో హల్ చల్ చేసింది. దీనిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా.. సాంగ్ మాత్రం చాలా బాగుందనే కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సినిమా మొదటి సాంగ్ రిలీజ్ నుంచి తమన్ ఎస్ సంగీతంపై గుస్సాగా ఉన్న మహేశ్ బాబు ఫ్యాన్స్ ఈ సాంగ్ తో ఓన్ చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది. విడుదలై 24 గంటలు గడవకముందే 43 లక్షలకు పైగా వ్యూవ్స్ దక్కించుకుంది. ఈ సాంగ్ లో హీరో మహేశ్, హీరోయిన్ శ్రీలీల మాస్ స్టెప్పులతో అదరగొట్టారు. ఈ సాంగ్ కు సంబంధించి కొరియో గ్రాఫర్ పై కూడా మహేశ్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఏది ఏమైనా ‘కుర్చీని మడతపెట్టి..’ భారీగా హిట్ అయ్యిందని మాత్రం తెలుస్తుంది. సాంగ్ పై ఇండస్ట్రీలో కూడా పాజిటివ్ రెస్పాండ్ వస్తుంది. బిత్తిరి సత్తి బీప్ సౌండ్ ఈ సాంగ్ కు మరో హైలట్ అని చెప్పవచ్చు.