Ajit Doval :
ప్రస్తుతం అజిత్ దోవల్ కు ఇండియాకు సంబంధించిన గూఢ చార ఏజెన్సీలు రా, ఐబీ, ఎన్టీఆర్వో, ఎంఐ. డీఐఏ. ఎన్ఐఏ తమ నివేదికలను ఎప్పటికప్పుడు చేరవేస్తుంటాయి. ఈ వ్యవస్థలన్నీ ఆయన పర్యవేక్షణలోనే పని చేస్తుంటాయి. ఇందుకు సంబంధించిన తుది నివేదికను జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న అజిత్ దోవల్ ప్రధానికి నివేదిస్తారు. భద్రతా అంశాల్లో ఇతర దేశాల కూడా అవసరమైన సమాచారాన్ని ఆయన పంచుకుంటారు.
ఇక అజిత్ దోవల్ అడుగులు అత్యంత వ్యూహాత్మకంగా ఉంటాయని ఆయన గురించి తెలిసిన వారు చెబుతుంటారు. ఆయన ఎంతో కటువుగా మాట్లాడుతారు. భారత్ ప్రస్తుతం తన రక్షణపరమైన ఒప్పందాలను అజిత్ దోవల్ సమక్షంలో చేసుకుంటున్నదంటే, ఆయన ప్రధాని మోదీకి ఎంత నమ్మకస్తుడో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవచ్చు. ఉగ్రవాదులు, ప్రతికూల శక్తులపై వ్యూహాత్మక, ప్రతీకార దాడులు చేయడంలో అజిత్ దోవల్ సలహాలనే నేషనల్ ఏజెన్సీలు తీసుకుంటుంటాయి. దేశంలో అత్యంత కీలక హోదాలో ఆయన అహర్నిశలు శ్రమిస్తుంటారు. ఇక ప్రతి నిమిషం భద్రతాపరమైన అంశాలను ఆయన ప్రధానితో పంచుకుంటుంటారు. ఇక ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న అజిత్ దోవల్ చైనా, పాకిస్థాన్, ఇజ్రాయెల్ దేశాలకు సంబంధించిన రాయబార అంశాలను కూడా పర్యవేక్షిస్తుంటారు.
ReplyForward
|