38.7 C
India
Thursday, June 1, 2023
More

    Bring that law : ఏంటి.. వైసీపీ ఆ చట్టం తేబోతుందా..?

    Date:

    • ఇక చంద్రబాబు పని అయినట్టేనా..
    bring that law
    bring that law, Chadra babu road show.

    bring that law : ఏపీలో రాజకీయాలు ఎప్పడు వేడి మీదే ఉంటాయి. టీడీపీ, వైసీపీ మధ్యలో జనసేన ఏదో చోట నిత్యం ఘర్షణలే. ఇక ఈ పార్టీల ఎమ్మెల్యేల నుంచి ముఖ్యనేతల వరకు పొద్దున లేస్తే మొదలెట్టే బూతుపురణం అంతా ఇంతా కాదు. వీరి మాటలు వింటుంటే అసలు రాజకీయాలు మరీ ఇంతలా దిగజారి పోయాయా అనిపిస్తుంది. దేశంలోనే అత్యంత ఎక్కువ నీచ రాజకీయాలు ఇక్కడే వినిపిస్తాయని చర్చ కూడా జోరుగా సాగుతున్నది. ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇది మరీ ఎక్కువైందనే వాదన వినిపిస్తున్నది. చంద్రబాబు లాంటి ఓ అగ్రనేతను కూడా ఏడిపించే స్థాయిలో వైసీపీ క్రూర రాజకీయ నడిచిందంటే ఇక ఏపీ భవిష్యత్ ఏంటో అర్థమవుతూనే ఉందని పక్క రాష్ర్టాల నేతలు చెబుుతున్నారు.

    చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లకుండా..

    అయితే ప్రతిపక్ష నేతలు సభలు మీటింగులు రోడ్లపై పెట్టకుండా ప్రభుత్వం ఇటీవల జీవో నంబర్ వన్ తెచ్చింది. దీనిని సీరియస్ గా తీసుకున్న ప్రతి పక్షాలు హైకోర్టును ఆశ్రయించాయి. అయితే ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనని న్యాయస్థానం అభిప్రాయ పడింది. వెంటనే జీవో ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా సజ్జల మాట్లాడుతూ చంద్రబాబు సభల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని, అందుకే ఆయన రోడ్డెక్కకుండా మరో జీవో తెస్తామన్నారు. దీంతో అంతా విమర్శలు గుప్పిస్తున్నారు.

    వైసీపీ అధినేత జగన్ ప్రస్తుతం ప్రజల్లోకి వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. అధికారాన్ని అనుభవిస్తున్నారు. ఆయన పర్యటనలు ఉన్నచోట భారీకేడ్లు, పరదాలు కట్టడం లాంటి వి చేస్తున్నారు. ఇక చంద్రబాబు ప్రజల్లోకి నేరుగా వెళ్తున్నారు. ఆయన పర్యటనలకు ఇటీవల జోష్ పెరుగుతూ వస్తున్నది. పోలీసులు కంట్రోల్ చేయలేకపోవడం వలన జరిగిన ఘటనను అడ్డుపెట్టుకొని చంద్రబాబు ను కట్టడి చేయాలని చూస్తున్నారు. అంటూ ఏపీ జనం చెవులు కొరుక్కుంటున్నారు. ఏదేమైనా వైసీపీ నేతల తీరు బాగా లేదని విమర్శిస్తున్నారు.
    సజ్జల కామెంట్స్ మాత్రం చంద్రబాబును కట్టడి చేయడానికి జగన్ ఏదో పెద్ద తతంగమే నడుపుతున్నారని అనిపిస్తున్నది. ఎన్నికలకు ఏడాది ముందు ఆయనను ప్రజల్లోకి వెళ్లకుండా చేస్తేనే వచ్చే ఎన్నికల్లో తమకు ఢోకా ఉండదని, లేదంటే ఈ సీనియర్ నేత తమను గెలవనీయడని భావిస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు అంత సీనియర్ నేత మరొకరు ప్రస్తుతం లేరు. వన్స్ మోర్ అంటూ అధికారంలో కి వచ్చిన జగన్ , తన నేతల తీరుతో ఎంతో వివాదస్పదుడయ్యారు. సో మరి ఏపీ ప్రజలు చంద్రబాబు వైపు చూస్తున్నారని జగన్ కు కొంత సమాచారం ఉండే ఉంటుంది. అందుకే ఈ కట్టడి ప్లాన్ మొదలు పెట్టారని టాక్.

    Share post:

    More like this
    Related

    మనం వాడే టైర్లు రీసైకిల్ చేయొచ్చా.. కువైట్ లో వీటిని ఏం చేశారు..?

      ఇప్పుడు వాడుతున్న ప్రతి వాహనానికి టైర్లు కీలకం. అయితే ఇవి వాడేసిన...

    ఆవుపాలు ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసా?

      మనం రోజు పాలు తాగుతుంటాం. పాలలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల...

    మరోసారి పూనకాలు లోడింగ్ అనేలా చిరు వింటేజ్ లుక్.. భోళా ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?

    మెగాస్టార్ చిరంజీవి భోళా మ్యానియా స్టార్ట్ అవ్వనుంది నుండి కొన్ని రోజుల...

    సునీల్ కనుగోలు కు బంపర్ ఆఫర్… ఏకంగా క్యాబినెట్ హోదా..!

    కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది.   భారీ విజయం సాధించడంతో అధికారంలోకి...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Jagan Rule AP : నాలుగేళ్ల జగన్ పాలన.. ..అంతా ఓకేనా..!

    CM Jagan Rule AP : ఏపీ సీఎం గా వైఎస్ జగన్మోహన్...

    Financial crisis : ఆర్థిక దివాళాతో ఏపీ విలవిల.. సీఎం జగనే కారణమా..?

    Financial crisis : ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతున్నది. అప్పులు...

    Time for YCP : 2024 వైసీపీకి గడ్డు కాలమే.. ఇక చావోరేవో తేల్చుకోవాల్సిందే…

    Time for YCP : ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేండ్లు...

    Jagan meet BJP : బీజేపీ పెద్దలతో జగన్ భేటీ.. రాజకీయమా.. వ్యక్తిగతమా..?

    Jagan meet BJP : ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్...