AP Re-Division Of Districts : ఏపీలో వైఎస్ జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. మరోసారి జిల్లాల పునర్విభజనపై దృష్టి పెట్టినట్లు సమాచారం. కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఈ పోలవరం కొనసాగుతున్నది. అయితే ఇప్పుడు దానిని మార్చే అవకాశం కనిపిస్తున్నది. పోలవరం నిర్వాసితులకు ప్రత్యేక జిల్లా ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అయితే శుక్రవారం నిర్వహించే సమావేశం లో ఈ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది.
జిల్లాల పునర్విభజనం అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. జిల్లాల సంఖ్యలో మార్పు లేకపోయినా కొన్నింటి పునర్విభజన ఉండే అవకాశం ఉంది. కొన్ని డిమాండ్ల నేపథ్యంలో మార్పులకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. అన్నమమయ్య జిల్లా ఏర్పాటును రద్దు చేసి పాత కడప జిల్లాను పునరుద్ధరించాలని అనుకుంటున్నట్లు సమాచారం. కడప జిల్లాను అలానే ఉంచి, మదనపల్లి, పీలేరు, తంబళ్లపల్లి నియోజకవర్గాలను చిత్తూరు జిల్లాలో కలపాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది కోడూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఇక తిరుపతిలో కలిపే అంశం కూడా చర్చ కు రానుంది.
అనంతపురం జిల్లాను తిరిగి పూర్వస్థాయికి తీసుకురావాలనే చర్చ వినిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటైన పార్వతిపురం మన్యం జిల్లా ఏర్పాటు నుంచి కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గనున్నట్లు సమాచారం. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. అయితే పోలవరం కేంద్రంగా గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. దీనికి జగన్ కూడాగ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే మరికొన్ని జిల్లాలపై కూడా చర్చ జరుగుతున్నది. ఇందులో గిరిజనులు ప్రస్తుతం జిల్లా కేంద్రమైన పాడేరుకు కార్యాలయ పనుల కోసం రావాలంటే కనీసం 200 కిలో మీటర్లు రావాల్సి ఉంటుంది. ఇక ఇక్కడ కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్ల సమాచారం. మన్యం జిల్లాను రద్దు చేసినా పోలవరం ఏర్పాటు చేయడం ద్వారా గిరిజ జిల్లాల సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండదు.