KCR : మన్నెగూడ భూవివాదంలో కేసీఆర్ బంధువు అరెస్ట్ అయ్యారు. భూవివాదం కేసులో ఆయన అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నా రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల 3 న ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో కన్నా రావు పై కేసు నమోదు అయింది. మన్నె గూడలో రెండు ఎకరాల భూమి కబ్జాకు యత్నించినట్లు కన్నారావుతో పాటు 38 మందిపై కేసులు నమోదయ్యాయి.
ముందస్తు పేలు కోసం ప్రయత్నించిన హైకోర్టు తిరస్కరించింది. మొత్తం మీద భూ వివాదం కేసులు కెసిఆర్ బంధువు కల్వకుంట్ల కన్నారావు పోలీసులు అరెస్టు చేయడంతో హాట్ టాపిక్ గా మారింది. ప్రతిపక్షాలను టార్గెట్ చేసే విధంగా రాజకీయం జరుగుతుందని గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.