Malli Palli In OTT : పవిత్ర లోకేష్, నరేష్ ప్రేమాయణం కొనసాగుతోంది. రియల్ లైఫ్ ను రీల్ లైఫ్ గా మారుస్తూ మళ్లీ పెళ్లి సినిమా తీశారు. దర్శక నిర్మాత ఎంఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. ఎన్నో ఊహలతో నిర్మించిన సినిమా బెడిసికొట్టడంతో కంగుతిన్నారు. దీంతో మళ్లీపెళ్లి నిజమైన కథ కావడంతో ప్రేక్షకులు ఎక్కువ మంది ఉత్సాహం చూపించలేదు.
విజయకృష్ణ బ్యానర్ పై వీకే నరేష్ స్వయంగా నిర్మించారు. రియల్ లైఫ్ లో సంఘటనల ఆధారంగా ఎమ్మెస్ రాజు ఈ సినిమాను నిర్మించారు. టీజర్స్, ట్రైలర్స్ తో ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచినా థియేటర్లలో మాత్రం నిలబడలేకపోయింది. మే 26న విడుదలైనా పెద్దగా ఆడలేదు. ప్రమోషన్ చేయడంలో వెనకబడిపోయినట్లు చెబుతున్నారు. కానీ సినిమా కలెక్షన్లు కొల్లగొట్టలేకపోయింది.
ఈ నేపథ్యంలో మళ్లీ పెళ్లి సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది. నరేష్, పవిత్రలకు ఫేమ్ దృష్ట్యా సుమారు రూ.2 కోట్లకు మళ్లీ పెళ్లి ఓటీటీ హక్కులు కొనుగోలు చేసుకున్నట్లు తెలుస్తోంది. మళ్లీ పెళ్లి సినిమా ఇలా అభిమానులను నిరుత్సాహపరచింది.
నరేష్ , పవిత్ర నిజ జీవితంలో కూడా ప్రేమికులుగానే ఉన్నారు. నరేష్ కు ఇది వరకు మూడు పెళ్లిళ్లు అయినా నాలుగో పెళ్లికి రెడీ అయిపోయాడు. పవిత్రకు కూడా ఇదివరకే పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇలా వీరు తమ నిజ జీవితాలను కథగా మలుచుకుని సినిమా తీయడంతో అందరు చూస్తారని అనుకున్నారు కానీ ఎవరు చూడలేదు.
ReplyForward
|