Malli Pelli OTT : జీవితంలోని కొన్ని ఘట్టాలు, మరికొంత ఫిక్షన్ యాడ్ చేసి తీసిన సినిమా ‘మళ్లీ పెళ్లి’. సీనియర్ నరేశ్, పవిత్రా లోకేశ్ జంటగా చేసిన సినిమా మళ్లీ పెళ్లి. ఈ సినిమాను ఎంఎస్ రాజు తెరకెక్కించగా. నరేశ్ నిర్మాతగా వ్యవహరించారు. నరేశ్ పవిత్రా లోకేశ్ గురించి చాలా కాలంగా కొనసాగుతున్న ప్రేమాయణం నేపథ్యంలో ఈ సినిమాకు బాగా హైప్ పెరిగింది. ఎన్నో అంచనాల మధ్య మే 26వ తేదీ థియేటికల్ రిలీజ్ అయ్యింది.
ఈ సినిమా అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు అలాంటి టాక్ సంపాదించుకుంది. దీంతో ఆదరణ తగ్గింది. కలెక్షన్లు కూడా పెద్దగా రాలేదు. పైగా చాలా ఏరియాల్లో జీరో షేర్ వచ్చింది.
‘మళ్లీ పెళ్లి’కి సంబంధించి ఓటీటీకి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. సినిమా చుట్టూ కమ్ముకున్న వివాదాల కారణంగా డిజిటల్ హక్కులు కొనుగోలు చేసేందుకు స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్స్ పోటీ పడ్డాయి. ఇందులో అమేజాన్ ప్రైమ్ ఈ సినిమా హక్కులను దక్కించుకుంది. థియేటర్ రిలీజ్ అయితే దాదాపు 4 వారాల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేలా మొదలే ఒప్పందం కుదిరింది. తగ్గట్టుగానే మే 26న ‘మళ్లీ పెళ్లి’ రిలీజైతే.. జూన్ 23 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని అమెజాన్ ప్రకటించింది.
ఈ మూవీలోని చాలా సన్నివేశాలను సెన్సార్ బోర్డ్ అనుమతించలేదు. ఇప్పుడు వాటిని యాడ్ చేసి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ‘విజయకృష్ణ మూవీస్’ పతాకంపై నరేశ్ నిర్మించారు. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందించిన ఈ మూవీకి సంగీతం సురేష్ బొబ్బులి, అరుల్దేవ్ సమకూర్చారు.