Malli Pelli OTT : సీనియర్ హీరో నరేశ్ నటిస్తూ నిర్మించిన ‘మళ్లీ పెళ్లి’ ఈ మధ్యనే థియేటికల్ రిలీజ్ అయ్యింది. నరేశ్, పవిత్ర లోకేశ్ కు సంబంధించి బయోగ్రఫీ చిత్రంగా ఈ మూవీని మలిచారు డైరెక్టర్. పవిత్ర లోకేష్ తో నరేశ్ నడిపిన ప్రేమాయణంనే ఈ చిత్రానికి కథగా ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రానికి రివ్యూస్ పాజిటివ్ గా కనిపించినా.. కలెక్షన్లు మాత్రం అంతగా రాలేదు. నరేశ్ ఆటోబయాగ్రఫీ అంటూ సాగిన ఈ చిత్రం మొదటి రోజు బాగానే వసూలు చేసింది. ఇక రెండో రోజు నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చింది.
చిత్రానికి ఖర్చు రూ. 15 కోట్ల వరకూ అయ్యిందంటూ నరేశ్ చెప్పుకస్తున్నా.. వాస్తవానికి రూ. 8 కోట్లు కూడా ఖర్చు కాలేదు. డిజిటల్, సాటిలైట్ రైట్స్ రూపంలో నిర్మాత నరేశ్ ఎప్పుడో సేఫ్ అయ్యారనే చెప్పాలి. అయితే అమేజాన్ ప్రైమ్ సంస్థ ఈ సినమాకు సంబంధించి డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసింది. అయితే గతంలో ఆఫర్ చేసిన రేటుకంటే ఇప్పుడు ఎక్కువ చెల్లిస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చింది అమేజాన్.
జూన్ 20న ప్రైమ్ లో అందుబాటులో ఉంచాలనుకున్నారు మేకర్స్. కానీ సినిమా థియేటర్లలో రెండో రోజు నుంచే కలెక్షన్లు పడిపోవడాన్ని చూసి ఈ డేట్ ను వీలైనంత ముందుకు జరిపేందుకు నిర్ణయించుకున్నారు. థియేటర్స్ లో ఇలాంటి సినిమాలు ఎక్కువగా ఆడడం కష్టమే. అయితే ఓటీటీలో అలాకాదు. ఇంకా కుటుంబ ప్రేమ కథా చిత్రాలకు ఓటీటీలోనే ఎక్కువ ఆదరణ లభిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఓటీటీలో జూన్ 4వ తేదీ నుంచి ఈ స్ట్రీమింగ్ లో ఉంచాలని అమేజాన్ భావిస్తోంది.
ఇందుకు నరేశ్ కూడా ఒప్పుకుంటే మనీ కూడా 30శాతం ఎక్కువ ఇచ్చేందుకు ప్రైమ్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రొడ్యూసర్ నరేశ్ కూడా దీనికి ఓకే చెప్పాడు. అంటే ఈ మూవీ దాదాపు మరో వారం రోజుల్లో అంటే జూన్ 4వ తేదీ నుంచి అమేజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ఓటీటీలో ఎలా ఆడుతుందో చూడాలి మరి.