35.7 C
India
Thursday, June 1, 2023
More

    Media house : మితీమీరుతున్న ఏబీఎన్ 

    Date:

    • టీడీపీ పుట్టి ముంచుతున్న మీడియా హౌస్
    Media house
    Media house, jagan vs abn

    Media house : ఏపీ అధికార పక్షంపై ఏబీఎన్ మీడియా విరుచకుపడుతున్న తీరు టీడీపీ శ్రేణులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. వైసీపీ మీద దాడి చేస్తున్న తీరుతో టీడీపీ పుట్టి ముంచేలా ఉన్నది. అసలు టీడీపీని ముంచడానికి ఏబీఎన్ అంతర్గతంగా ఏదైనా ఒప్పందం చేసుకుందా అనే అనుమాలను పలువురిలో కలుగుతున్నాయి. అవినాష్ రెడ్డిపై సీబీఐ విచారణ విషయంలో కానీ, అమరావతి అంశాల్లో కానీ ఏబీఎన్ చేస్తున్న అత్యుత్సాహం వెంకటకృష్ణ ఓవరాక్షన్ ను తిప్పి కొట్టేందుకు వైసీపీ సోషల్ మీడియాకు మంచి అవకాశం  ఇచ్చినట్లు అవుతున్నది.

    ఏబీఎన్ మీడియా తీరు చూస్తుంటే ఏపీలో తానే ప్రధాన ప్రతిపక్షమే రీతిలో వ్యవహరిస్తున్ని. క్షేత్ర స్థాయిలో ప్రజల మనోభావాలు గుర్తించకపోవడం, ఇష్టారీతిన ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుండడంతో వెంకటకృష్ణ వైఖరిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీకే గతంలో టీవీ5లో ఉన్నప్పుడు.. జగన్ కు సపోర్ట్ గా మాట్లాడగా, ఇప్పుడేమో ఏబీఎన్ తగ్గట్లుగా వ్యవహరిస్తున్నారు.  వీకే కామెంట్లను పట్టుకుని ప్రచారం చేసుకోవాలన్నట్లుగా అధికా పా్ర్టీ  సోషల్ మీడియా రెడీ కాచుకొని కూర్చున్నది.

    అవినాష్ రెడ్డి అరెస్ట్ విషయంలో వీకే స్పందన మాములుగా లేదు ! అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేస్తుందో లేదో తెలియదు కానీ ఏబీఎన్ మాత్రం అరెస్ట్ చేసేసింది అన్నట్లుగా ప్రచారం చేస్తున్నది. విచారణ ప్రతి దశలోనే అతి చేస్తున్నది. టీడీపీ సానుభూతిపరులు కూడా వైసీపీ వైపు మళ్లేలా చేస్తున్నది. ఏబీఎన్ ప్రచారాలపై  వైసీపీ నేతలు కామెడీ చేస్తున్నారు. తమ ప్రమేయం లేకుండా ఏబీఎన్ మీడియా స్వయంగా టీడీపీకి డ్యామేజ్ చేస్తున్నదంటూ  వైసీపీ శ్రేణలు సంబుర పడిపోతున్నాయి. మీడియా ఎప్పుడూ ప్రజల ఉండాలని, ఒక పార్టీకి అంటకాగి, ఆ పార్టీ వాయిస్ ను తామే వినిపించడం, చూపించడంపై కొంత వ్యతిరేకత కనిపిస్తున్నది.

    ఏబీఎన్ విషయంలో టీడీపీ నేతలు కూడా కొంత అసహనానికి గురవుతున్నారు. ఏబీఎన్ , ఆంధ్రజ్యోతి వల్ల తమకు లాభం జరుగుతుందని టీడీపీకి క్యాడర్ భావించడం లేదు. నష్టమే కలుగుతుందన్న చర్చలు ఆ పార్టీ వర్గాల్లో నడుస్తున్నాయి.  ప్రభుత్వ లోపాలను కొన్నింటిని ఏబీఎన్ బయటపెట్టిన, ఆ తర్వాత తతంగమంతా మితిమీరుతున్నది. ఏబీఎన్ మేనేజ్ మెంట్ ఎటుపోతున్నది. ? ఓ మీడియా హౌస్ ను ఇంత దిగజార్చాలా అనే చర్చలు సదరు మీడియా హౌస్ లోని సిబ్బందే చర్చించుకుంటున్నట్లు సమాచారం. గతంలో అంకితాభావడంతో పనిచేసే పాత్రికే బృందం ఉండేది. వారికి అన్ని విషయాలపై పట్టు ఉండేది. ఏది ఏ స్థాయిలో ఉంచాలో పకడ్బందీగా లెక్కలు వేసుకునే వారు.

    ప్రస్తుతం అందరూ కొత్త వాళ్లే వచ్చారు. యాజమాన్యాన్ని సంతృప్తి పరిస్తే చాలు అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. ఏ మాత్రం సోయి లేకుండా విరుచుకుపడుతున్నారు. క్షేత్ర స్థాయి విషయాలపై ఏబీఎన్ యాజమాన్యం ఏ మాత్రం దృష్టిసారించడం లేదు. దీంతో ఏపీలో ఏబీఎన్ నవ్వుల పాలవుతున్నదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏబీఎన్ అతి తగ్గించుకుంటే మంచిదని టీడీపీ కేడర్ కూడా సూచిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    మనం వాడే టైర్లు రీసైకిల్ చేయొచ్చా.. కువైట్ లో వీటిని ఏం చేశారు..?

      ఇప్పుడు వాడుతున్న ప్రతి వాహనానికి టైర్లు కీలకం. అయితే ఇవి వాడేసిన...

    ఆవుపాలు ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసా?

      మనం రోజు పాలు తాగుతుంటాం. పాలలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల...

    మరోసారి పూనకాలు లోడింగ్ అనేలా చిరు వింటేజ్ లుక్.. భోళా ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?

    మెగాస్టార్ చిరంజీవి భోళా మ్యానియా స్టార్ట్ అవ్వనుంది నుండి కొన్ని రోజుల...

    సునీల్ కనుగోలు కు బంపర్ ఆఫర్… ఏకంగా క్యాబినెట్ హోదా..!

    కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది.   భారీ విజయం సాధించడంతో అధికారంలోకి...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Jagan Rule AP : నాలుగేళ్ల జగన్ పాలన.. ..అంతా ఓకేనా..!

    CM Jagan Rule AP : ఏపీ సీఎం గా వైఎస్ జగన్మోహన్...

    Financial crisis : ఆర్థిక దివాళాతో ఏపీ విలవిల.. సీఎం జగనే కారణమా..?

    Financial crisis : ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతున్నది. అప్పులు...

    Time for YCP : 2024 వైసీపీకి గడ్డు కాలమే.. ఇక చావోరేవో తేల్చుకోవాల్సిందే…

    Time for YCP : ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేండ్లు...

    Jagan meet BJP : బీజేపీ పెద్దలతో జగన్ భేటీ.. రాజకీయమా.. వ్యక్తిగతమా..?

    Jagan meet BJP : ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్...