Weather Report : దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని ప్రకటించింది. జూలై నాటికి నైరుతి పవనాలు దేశమంతటా విస్తరిస్తాయని వెల్లడించింది. సగటు వర్షపాతం 106 శాతం కంటే ఎక్కువ ఉంటుందని తెలిపింది.
ఇక తెలుగు రాష్ఠ్రాలకూ వర్షపాతం ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటనలో వెల్లడించింది. రోజు రోజుకి భానుడి భగభగలు ఎక్కువైపోతున్న ఈ తరుణంలో దేశంలో రెండు రోజులు కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు, మరికొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతుందని తెలిపింది.