29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Modi Meeting : ఎలన్ మస్క్ తో మోడీ భేటీ.. ఆ విషయాలపై స్పష్టత..? మరో 24 మంది ప్రముఖులతో కూడా..

    Date:

    Modi meeting
    Modi meeting, Elon Musk

    Modi meeting : భారత ప్రధాని నరేంద్ర మోడీ నాలుగు రోజుల అమెరికా పర్యటనకు మంగళవారం ఉదయం బయల్దేరి వెళ్లారు. బుధవారం నుంచి అమెరికాలో ఆయన పర్యటన ప్రారంభమవుతుంది. ఈ పర్యటనతో ఇండో-అమేరికా భాగస్వామ్యం మరింత బలపేట్లు ఉంది. ప్రస్తుత పర్యటనలో మోడీ షెడ్యూల్ చాలా బిజీగా ఉందని తెలుస్తోంది. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తో భీటీ కానున్న ఆయన ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. ఆ తర్వాత టెస్లా, ట్విటర్ అధినేత ఎలన్ మస్క్ తో కూడా ఆయన భేటీ కానున్నారు. ఈ సమావేశంలోనే దాదాపు 24 మంది ప్రపంచ ధిగ్గజ వ్యాపారులతో భేటీ అవుతున్నట్లు తెలుస్తోంది.

    పర్యటన అంశాలు..

    ఈ పర్యటనలో మోడీ ఫస్ట్ న్యూయార్క్ లో పర్యటిస్తారు. ఇందులో అధ్యక్షుడితో సహా ప్రభుత్వ ప్రముఖులతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారంపై చర్చించనున్నారు. ఈ చర్చలతో జీ-20, క్వాడ్‌, ఇండో-పసిఫిక్‌ ఎకానమిక్‌ ఫ్రేమ్‌ వర్క్‌ సదస్సుల్లో ఇరు దేశాల భాగస్వామ్యం పెంపొందిస్తుంది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ యోగా వేడుకల్లో బుధవారం పాల్గొంటారు. యోగా దినోత్సవాన్ని అంతర్జాతీయంగా నిర్వహించాలన్న భారత ప్రతిపాదనను అమెరికా ఆమోదించింది. ఈ నేపథ్యంలో అదే చోట వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని మోడీ అన్నారు.

    బైడెన్‌తో ఏం మాట్లాడనున్నారు..?

    న్యూయార్క్‌ పర్యటలన తర్వాత ప్రధాని వాషింగ్టన్‌ వెళ్లనున్నారు. బిజినెస్, టెక్నాలజీ, సృజనాత్మకత వంటి రంగాల్లో ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రక్షణ రంగంలో పరస్పర సహకారం కోసం ఈ పర్యటన చేపట్టినట్లు తెలుస్తోంది. బైడెన్‌ చర్చల్లో ఉమ్మడిగా రక్షణ ఉత్పత్తుల తయారీ, అభివృద్ధికి రోడ్డు మ్యాప్‌ రూపొందిచాలని భారత్ భావిస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ దంపతులు.. శ్వేతసౌధంలో మోడీకి విందు ఇవ్వనున్నారు. తర్వాత అమెరికా కాంగ్రెస్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతారు. గతంలో ట్రంప్ హయాంలో అమెరికన్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. ఈ ఘనత సాధించిన తొలి భారత ప్రధానిగా రికార్డు కూడా మోడీ నెలకొల్పారు. ఈ పర్యటన తర్వాత ఈజిప్టుకు వెళ్లనున్నారు. 25న భారత్‌ చేరుకోనున్నారు.

    ఎలాన్ మస్క్ తో ఏం చర్చించబోతున్నారు.?

    ప్రపంచ అపర కుబేరుడు, టెస్లా, ట్విటర్ అధినేత ఎలన్ మస్క్‌తో ప్రధాని మోడీ భేటీ కానున్నారు. తొలిసారి వీరు సమావేశం కావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, రచయిత, సైన్స్ కమ్యూనికేటర్ నీల్ డీ గ్రాస్సే టైసన్‌తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ బ్యాంక్ మాజీ చీఫ్ ఎకనమిస్ట్ పాల్ మైకేల్ రోమర్‌తోనూ కొన్ని అంశాలపై చర్చించనున్నారు. ఈ పర్యటనలో భారత మూలాలున్న సింగర్, 2022 గ్రామీ అవార్డు విన్నర్ ఫాలూ షాతో మోదీ మాట్లాడనున్నారు. వీరితో సహా 24 మంది అమెరికాలోని రక్షణ శాఖలో పనిచేసిన మాజీ అధికారులను కలవనున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Trump : అధ్యక్షుడు ట్రంప్ కు గట్టి షాక్.. వైదొలిగిన మస్క్

    Trump : టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ గట్టి షాకిచ్చారు....

    Robots : రోబోలే ఇక కటింగులు చేస్తాయి.. భవిష్యత్ ఆవిష్కరించిన ఎలన్ మస్క్

    Robots : తాజాగా ప్రపంచ కుబేరుడు, టెక్నాలజీ సృష్టికర్త ఎలన్ మస్క్ ఒక...

    Elon Musk : ఎలోన్ మస్క్ MSNBC కొనబోతున్నాడా..?

    Elon Musk : ప్రపంచ కుభేరుడు ఎలాన్ మస్క్ ప్రముఖ న్యూచ్...

    Musk : అంబానీని ఆ విషయంపై ప్రశ్నిస్తానన్న మస్క్..

    Elon Musk : అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా శాటిలైట్ కమ్యూనికేషన్ స్పెక్ట్రమ్‌ను...