Mrunal Thakur : సీతారామం సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అయిన బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఈమె గురించి తెలియని వారు లేరు.. ఈమె కుంకుమ భాగ్య అనే సీరియల్ తో ఫేమస్ అయి ఆ తర్వాత వెండితెర మీద అదృష్టం పరీక్షించుకునేందుకు ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ అమ్మడు లక్ బాగుండడంతో రాగానే ఫేమస్ అయ్యింది.
ముఖ్యంగా సౌత్ వారికీ ఈ భామ బాగా కనెక్ట్ అయ్యింది.. సీతారామం అనే బ్యూటిఫుల్ సినిమాతో తెలుగుతో పాటు సౌత్ ప్రేక్షకులను ఈ భామ మాయ చేసింది. సీత పాత్రలో మృణాల్ నటనకు అంత ఫిదా అయిపోయారు.. ఈ అమ్మడు ఒకే ఒక్క సినిమాతో ఇక్కడ ఫేమస్ అయ్యి వరుస అవకాశాలు కూడా అందుకుంటుంది.
ఎటువంటి తొందర లేకుండా నిదానంగా అలోచించి అడుగులు వేస్తుంది.. సినిమాల విషయంలో రాంగ్ స్టెప్స్ తీసుకోకుండా చాలా జాగ్రత్తగా మంచి కథలను ఎంచుకుంటుంది.. టాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే మరో వైపు బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటుంది.. తాజాగా ఈ బ్యూటీ గురించి ఒక న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.
ఈ న్యూస్ విన్న వారంతా షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ న్యూస్ ఏంటంటే.. ఈ భామ రేచీకటితో బాధ పడుతున్నదని ఆ విషయాన్నీ దాచి పెళ్లి కోసం వరుడిని వెతికే పనిలో ఆమె కుటుంబ సభ్యులు ఉన్నారని స్వయంగా ఆమెనే చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆమె ఒక సినిమా గురించి చెప్పిందట.. అందుకే ఈమె చేసే రోల్ గురించి చెప్పగా ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి..