ఎన్టీఆర్టీ శత జయంతి వేడుకల్లో తమిళ సూపర్ స్టార్ చేసిన వ్యాఖ్యల వేడి ఇప్పట్లో తాగేలా లేదు.. టీ డీపీ అధినేత చంద్రబాబు విజనరీ’ అంటూ తమిళ సూపర్స్టార్, తలైవర్ రజనీకాంత్ చేసిన ప్రశంసల పట్ల వైసీపీ నేతలు స్పందించిన తీరుపై ఆయన అభిమానులు రగిలిపోతున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా తాను స్పందించబోనని రజనీ స్పష్టం చేశారు.
‘టీడీపీ అధినేత చంద్రబాబు విజనరీ’ అంటూ తమిళ సూపర్స్టార్, తలైవర్ రజనీకాంత్ చేసిన ప్రశంసల పట్ల వైసీపీ నేతలు స్పందించిన తీరుపై ఆయన అభిమానులు రగిలిపోతున్నారు. ఎవరిపట్ల అయినా మంచిగా స్పందించే రజనీ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వైసీపీ నేతలు మాట్లాడడమేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాలైన తిరువళ్లూరు, వేలూరు, కాంచీపురం తదితర జిల్లాలకు చెందిన అభిమానులు వైసీపీ తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ‘చంద్రబాబును రజనీ పొడిగితే వీళ్లకెందుకంత బాధ’ అంటూ తీవ్రంగా స్పందిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కు రజనీకాంత్ ఫోన్ చేశారు. రజనీకాంత్పై వైసీపీ నేతల తీవ్ర విమర్శల పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల విమర్శలను పట్టించుకోవద్దని రజనీకాంత్ను చంద్రబాబు కోరారు. ‘‘ఎవరెన్ని విమర్శలు చేసినా స్పందించబోను. ఉన్న విషయాలే చెప్పాను.. నా అభిప్రాయం మారదు. సంయమనం పాటించాలని అభిమాన సంఘాలకు చెప్పాను’’ అని రజనీకాంత్, చంద్రబాబుతో అన్నారు.
వైసీపీ నేతలు తన పట్ల పెట్రేగిపోతున్నా రజనీ మాత్రం నోరు మెదపకపోవడం గమనార్హం. అయితే ఆది నుంచి రజనీ తీరే అంత అని ఆయన గురించి బాగా తెలిసిన సీనియర్లు చెబుతున్నారు.